మహబూబ్నగర్, మే 21 : జాతి ఐక్యతతోనే పురోభివృద్ధి సాధ్యమవుతుందని అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నా రు. విద్యార్థి దశ నుంచే ఉగ్రవాదంపై అవగాహన కల్పిస్తూ ప్రేమ, శాంతి దిశగా పయనించేందుకు కృషి చేయాలన్నా రు.
సమాజంలో అందరూ కలిసిమెలిసి ఉంటూ శాంతియుత వాతావరణంలో జీవించాలని ఆకాంక్షించారు. ప్రతిఒక్కరూ మత సామరస్యంతో మెలిగి జాతి ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉద్యోగులతో ప్రతి జ్ఞ చేయించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో కిషన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.