మహబూబ్నగర్, మే 3 : కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నామని మాయమాటలు చెబుతున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ధాన్యాన్ని కొనుగో లు చేస్తామని ఒకరు.. చేయబోమని మరొకరు చెబు తూ అన్నదాతలను మోసం చేశారన్నారు. మంగళవా రం ఎదిరలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహబూబ్నగర్ అంటే కరువు, పేద జిల్లా, బీడుభూములు తప్పా మరేమీ కనిపించదంటూ బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. గతానికి, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని చూసి మాట్లాడాలని హితవు పలికారు. ఎదిర సమీపంలోనే ఐటీ కారిడార్ ఏర్పాటు చేశామన్నారు. యాసంగిలో రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామన్నారు.
సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పరుగులు పెడుతున్నదన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ వద్ద రూ.15.50 లక్షలతో ఏర్పాటు చేసిన ‘లవ్ మన మహబూబ్నగర్’ సెల్ఫీ పాయింట్ను మంత్రి ప్రారంభించారు. అలాగే బసవేశ్వర జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బసవేశ్వరుడి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. బసవ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ట్లు చెప్పారు. ట్యాంక్బండ్పై బసవేశ్వర విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు.
ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ వెంకట్రావు, అదన పు కలెక్టర్ తేజస్నందలాల్పవార్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, డీసీసీబీ ఉపాధ్యక్షుడు వెంకటయ్య, మున్సిపల్ కమిషనర్ ప్ర దీప్కుమార్, బీసీ సంక్షేమ శాఖ అధికారిణి ఇం దిర, మార్కెట్ కమిటీ చైర్మన్ మహ్మద్ అబ్దుల్ రెహమాన్, కౌన్సిలర్లు రవికిషన్రెడ్డి, శాంతన్న, నాయకులు శ్రీశైలం, సత్యనారాయణ, పెద్ద రాములుయాదవ్, హన్మంతు, శివశంకర్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.