లింగాల, ఏప్రిల్ 29 : మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. శుక్రవారం మండలకేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో 81 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గువ్వల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.
ప్రజా సంక్షేమ పథకాలు అందరికీ చేరేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. అనంతరం ముస్లింలకు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుధీర్గౌడ్, సర్పంచ్ తిరుపతయ్య, మాజీ ఎంపీపీ జగపతిరావు, విండో మాజీ చైర్మన్ వెంకట్రెడ్డి, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు రవిశంకర్, తాసిల్దార్ సుధాకర్, నాయకులు తిరుపతయ్య, వెంకటగిరి, ఎల్లేశ్, రానోజీ, శ్రీనివాసులు, అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.