మహబూబ్నగర్టౌన్, అక్టోబర్ 1 : అన్నివర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మహబూబ్నగర్ మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు అన్నారు. జిల్లా కేంద్రంలోని 12, 13, 22, 27, 40, 34 వార్డుల్లో శనివారం మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పండుగపూట ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలని, చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. బతుకమ్మ పండుగను మహిళలు సంబురంగా జరుపుకోవాలని కోరారు. అలాగే పలు వార్డుల్లో మున్సిపల్ వైస్చైర్మన్ తాటి గణేశ్ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ షేక్ఉమర్, లక్ష్మీదేవి, రష్మిత, మస్రత్, కోట్ల నర్సింహులు, సంధ్య, చిన్న శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్ల మున్సిపాలిటీలో..
మున్సిపాలిటీలోని 11వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మ హిళలందరూ ఆనందంగా బతుకమ్మ పండుగను జరుపుకోవాలన్న ఉద్దేశంతో ప్రభు త్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్న ట్లు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు జ్యోతీకృష్ణారెడ్డి, శశికిరణ్, ముడా డైరెక్టర్ శ్రీకాంత్, టీఆర్ఎస్ నాయకులు దోరేపల్లి రవీందర్, మాలిక్షాకీర్, మున్సిపల్ సిబ్బం ది భగవాన్ తదితరులు పాల్గొన్నారు.
అడ్డాకుల మండలంలో..
అడ్డాకుల మండలకేంద్రంతోపాటు కాటవ రం, పెద్దమునగల్చేడ్, తిమ్మాయిపల్లితం డా, చిన్నమునగల్చేడ్, వర్నె, ముత్యాలంపల్లి గ్రామాల్లో జెడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్రెడ్డి, ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో మంజుల, ఎంపీవో విజయకుమారి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ జితేందర్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షు డు తిరుపతిరెడ్డి, కోఆప్షన్ సభ్యుడు ఖాజాగోరి, ఏపీఎం సుధీర్కుమార్ పాల్గొన్నారు.
దేవరకద్ర మండలంలో..
మండలంలోని రాజోళిలో జెడ్పీటీసీ అన్నపూర్ణ బ తుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం దసరా పండుగ కానుకగా ప్రతి ఆడపడుచుకూ బతుకమ్మ చీరను అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే చిన్నచింతకుంట మండలం ఉంద్యాలలో సర్పంచ్ కవిత బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రా జోళి సర్పంచ్ కృష్ణవేణి, వైస్ఎంపీపీ సుజా త, ఎంపీటీసీ కిష్టన్న, మాజీ ఎంపీపీ ఈవీ గోపాల్, శివకుమార్, తిరుపతిరెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
గండీడ్ మండలంలో..
మండలంలోని మన్సూర్పల్లి, జానంపల్లి గ్రామాల్లో జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి బతుకమ్మ చీరలను పం పిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ అన్ని పండుగలకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. పేదలు సంతోషంగా పండుగలు జరుపుకోవాలన్న ఉద్దేశంతో బతుకమ్మ చీర లు, క్రిస్మస్, రంజాన్ కిట్లు పంపిణీ చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఐకేపీ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
మండలకేంద్రంతోపాటు కుచ్చర్కల్లో సర్పంచుల సం ఘం మండల అధ్యక్షుడు బచ్చిరెడ్డి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహులు, సర్పంచ్ సుధారాణి, నాయకులు ఆనంద్గౌడ్, నరహరి, సత్య య్య, శ్రీనివాస్, అచ్చయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.