ఇన్చార్జి కలెక్టర్ తేజస్నందలాల్ పవర్
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 16 : వివిధ ప్రాజెక్టుల కింద చేపట్టిన భూసేకరణ పనులు ఉన్నట్లయితే తక్షణమే పూర్తి చేయాలని ఇన్చార్జి కలెక్టర్ తేజస్ నందలాల్పవర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఆయా ప్రాజెక్టుల కింద చేపట్టిన భూసేకరణపై ఇంజినీరింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులతో సమీ క్ష సమావేశం నిర్వహించారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, జాతీయ రహదారులు, పేరురూ రై ల్వే స్టేషన్, కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకాల కింద చేపట్టిన భూసేకరణ పనులపై సమీక్షిస్తూ ఇంకా ఎక్కడై నా పనులు పెండింగ్లో ఉన్నట్లయితే అధికారులు ప్ర త్యేక దృష్టితో పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ సీతారామారావు, ప్రత్యేక కలెక్టర్ పద్మశ్రీ, ఆర్డీవో అనిల్ కుమార్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
క్రీడలతో మానసికోల్లాసం
క్రీడలతో శారీరక దారుడ్యంతోపాటు మానసికోల్లాసం పెరుగుతుందని ఇన్చార్జి కలెక్టర్ తేజస్నందలాల్ పవర్ అన్నారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం నుంచి ఈనెల 18వ తేదీ వరకు జిల్లా క్రీడాశాఖ ఆధ్వర్యంలో స్టేడియం మైదానంలో కబడ్డీ, వాలీబాల్, షాట్ఫుట్, ఖోఖో, లాంగ్జంప్, టగ్ఆఫ్ వార్ క్రీడా అంశాల్లో జిల్లా స్థాయి క్రీడాపోటీలను నిర్వహించనున్నారు. మంగళవారం కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలను ఇన్చార్జి కలెక్టర్ ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థు లు చదువుతోపాటు క్రీడాల్లో రాణించాలని, క్రీడాకారులకు బం గారు భవిష్యత్తు ఉంటుందన్నారు. కార్యక్రమంలో డీవైఎస్వో శ్రీనివాస్, డీపీఆర్వో వెంకటేశ్వర్లు, పీఈటీలు పాల్గొన్నారు.