మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 15 : పంద్రాగస్టు వేడుకలను సోమవారం జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయజెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసు బ లగాల నుంచి మంత్రిపాటు జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రె డ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రె డ్డి, ఎస్పీ ఆర్.వెంకటేశ్వ ర్లు, అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు గౌరవవందనం స్వీకరించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులు వకీలు భీమయ్య, ముజఫర్సలీం, లక్ష్మణమూర్తి, సుగుణమ్మ, డోకూర్ లక్ష్మీదేవి, సుఖదాదేవి, కేవీ.రెడ్డి, బాలకిష్టయ్యను ఘనంగా సన్మానించారు. అలాగే ఉత్తమ సేవలు అందించిన అధికారులకు అవార్డులను ప్రదానం చేశారు. ప్రభుత్వ పథకాలపై ఆయా శాఖల ఆధ్వర్యంలో శకటాలను ప్రదర్శించారు. వేడుకల్లో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
సాంస్కృతిక కార్యక్రమం లో భాగస్వాములైన విద్యార్థులకు మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు. ముందుగా కొత్తగా పింఛన్ మంజూరైన 816మంది లబ్ధిదారులకు గుర్తింపుకార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దత్తరాజ్గౌడ్, డీఎంహెచ్వో కృష్ణ, వైద్యులు జీవన్, రఫీక్, డీఎస్పీ మహేశ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సైదులు, జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ రాంకిషన్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్చైర్మన్ గణేశ్, యాదయ్య, రాజేశ్వర్, సుదీప్రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా కోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఎస్.ప్రేమావతి, పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఎస్సీ వెంకటేశ్వర్లు, జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ మహబూబ్నగర్ కార్యాలయంలో డీసీసీబీ చైర్మన్ చిట్యా ల నిజాంపాషా జాతీయజెండాను ఎగురవేశారు.