చారకొండ, మే 12: టీఆర్ఎస్ నేత, చారకొండ సర్పంచ్ విజేందర్గౌడ్ తండ్రి, సింగిల్ విండో మాజీ చైర్మన్ గుండె బాలనారాయణగౌడ్ గ్రామాభివృద్ధికి చేసిన సేవలు మరువలేనివని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన బాలనారాయణగౌడ్ సంస్మరణ సభకు మంత్రి శ్రీనివాస్గౌడ్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యేలు జైపాల్యాదవ్, నరేందర్రెడ్డి, మాజీ మంత్రులు చిత్తరంజన్దాస్, జూపల్లి కృష్ణారావు, జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చారకొండ అభివృద్ధికి నిరంతరం పాటుపడ్డారని గుర్తుచేశారు. కార్యక్రమంలో బాలనారాయణగౌడ్ కుమారులు సీఐలు రాజశేఖర్గౌడ్, జనార్దన్గౌడ్, ఆర్మీ మాజీ ఆఫీసర్ మధుసూదన్గౌడ్, చంద్రశేఖర్, చారకొండ, వెల్దండ సింగిల్ విండో చైర్మన్లు గురువయ్యగౌడ్, భాస్కర్రావు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు గజ్జెయాదయ్యగౌడ్, జెడ్పీటీసీ భరత్ప్రసాద్తో మున్సిపల్ చైర్మన్లు ఎడ్మసత్యం, నర్సింహగౌడ్తోపాటు టీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రసిడెంట్ వెంకటయ్యయాదవ్, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు.
గీత కార్మికుల సంక్షేమానికి కృషి;ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం చారకొండకు వచ్చిన మంత్రికి గీత కార్మికులు నీరా ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గీత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. బకాయి పన్నులు రద్దు చేశామని, వైన్స్లో రిజర్వేషన్లు పెంచామని, ఏదైన ప్రమాదం జరిగితే రూ.5లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించడం జరుగుతుందన్నారు. చారకొండలో గీత కార్మికులు అధికంగా ఉన్నారని వారికి జీవనోపాధి కల్పించేందుకు నీరా ప్రాజెక్టు ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ గురువయ్యగౌడ్, నేతలు మహేశ్గౌడ్, సురేశ్గౌడ్, శ్రీనివాస్గౌడ్, సవారి శ్రీనుగౌడ్, గజ్జెశ్రీరాములుగౌడ్, పర్వతాలుగౌడ్, బాలరాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.