గద్వాల, ఫిబ్రవరి 17: సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు స్మైల్ గిఫ్ట్ అంటూ అర్భాటం లేకుండా పలువురికి సహాయం చేసే విధంగా సీఎం జన్మదిన వేడుకలు నిర్వహించినట్లు ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని 8వ వార్డులో ప్రభుత్వ బీసీ బాలుర వసతిగృహంలో కౌన్సిలర్ జయమ్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఎమ్మెల్యే పాల్గొని కేక్ కట్ చేశారు.అనంతరం వసతి గృహ విద్యార్థులతో మాట్లాడి వారి యోగక్షేమాలు ఎమ్మె ల్యే తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేసి వసతి గృహా ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో పురపాలక చైర్మన్ కేశవ్,వైస్ చైర్మన్ బాబర్,జడ్పీటీసీ ప్రభాకర్రెడ్డి, కౌన్సిలర్లు మురళి, శ్రీను,మహేశ్,నరహరిగౌడ్, నాగిరెడ్డి, నాగరాజు, పార్టీ నేతలు శివమ్మ,గోవిందు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో..
మఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో గులాబీ, చేమంతులతో కేసీఆర్ చిత్రపటాన్ని రూపొందించి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేశవ్, పీఏసీఎస్ చైర్మన్ సుభాన్, మార్కెట్కమిటీ చైర్పర్సన్ రామేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.
రేకులపల్లి యూపీఎస్లో..
మండలంలోని రేకులపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఎంపీపీ ప్రతాప్గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్చేసి విద్యార్థులకు పంచిపెట్టారు. కార్యక్రమంలో సర్పంచ్ శివమ్మ,టీఆర్ఎస్ నా యకులు రమేశ్నాయుడు, హనుమంత్రెడ్డి, పూడూరు చిన్నయ్య, బీసన్న తదితరులు పాల్గ్గొన్నారు.
అయిజలో
సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులతో కలిసి కేక్కట్చేశారు. మార్కెట్ యార్డులో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు., ఠాగూర్ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటారు. భువనేశ్వరి దవాఖానలో పండ్లు, బ్రెడ్ల పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిన్న దేవన్న, వైస్చైర్మన్ మాల నర్సింహులు, విండో చైర్మన్ మధుసూదన్రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ విష్ణువర్ధ్దన్రెడ్డి, మాజీ ఎంపీపీ సుందర్రాజు, మాజీ పీఏసీఎస్ చైర్మన్ రాముడు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మహబూబ్పాషా, ప్రధానకార్యదర్శి కామేశ్, సర్పంచ్లు నీలకంఠరెడ్డి, లక్ష్మన్నగౌడ్, కౌన్సిలర్లు సీఎం సురేశ్, నర్సింహులు, పూజారి వెంకటేశ్, ఆంజనేయులు, టీఆర్ఎస్ ముఖ్య నా యకులు వెంకటేశ్వర్రెడ్డి, మల్లికార్జున్రెడ్డి, ఉమేశ్గౌడ్, ఎలియాజర్, తిమ్మన్న, ఉసేని, వెంకటేశ్, ఖాజా, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, డైరెక్టర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎక్లాస్పురంలో..
మండలంలోని ఎక్లాస్పురం గ్రామంలో రాష్ట్ర యువజన నాయకుడు అజయ్ ఆధ్వర్యంలో కేక్కట్ చేసి మొక్కలు నాటారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు అందజేశారు.కార్యక్రమంలో ఎంపీపీ నాగేశ్వర్రెడ్డి, వడ్డేపల్లి జెడ్పీటీసీ కాశపోగురాజు, బీచుపల్లి ఆలయకమిటీ సభ్యుడు ఆంజనేయులు, నాయకులు బడేసాబ్యాదవ్, దేవదా సు, నర్సింహులు, కృష్ణగౌడ్, మహేశ్, మారెప్ప, అజయ్సేవాదళం సభ్యులు పాల్గొన్నారు.
మల్దకల్లో..
మండలకేంద్రంలో రైతులకు ట్రాన్స్ఫార్మర్లు, లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే బండ్ల పంపిణీ చేశారు.ఆయా గ్రామాలకు చెంది న 97 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు, 100 మంది రైతులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అందజేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి కేసీఆర్ జన్మదిన వేడుకల్లో కేక్ కట్చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజారెడ్డి, జెడ్పీటీసీ ప్రభాకర్రెడ్డి, కేటీదొడ్డి జెడ్పీటీసీ రాజశేఖర్, వైస్ ఎంపీపీ వీరన్న, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షు డు వెంకటేశ్వర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంక న్న, నాయకులు సీతారాంరెడ్డి, విక్రమసింహారెడ్డి, అజ య్, నర్సింహారెడ్డి, భాస్కర్, ఆంజనేయులు, జనార్దన్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, తిమ్మరాజు, ప్రభాకర్, మండల యూత్ అధ్యక్షుడు ప్రవీణ్, జిల్లా విద్యుత్ అధికారి భా స్కర్, తాసిల్దార్, నాయకులు, సర్పంచులు పాల్గొన్నారు.
అమరవాయి జెడ్పీహెచ్ఎస్లో
అమరవాయి జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్లను ఎంపీటీసీ గోపాల్రెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణరెడ్డి, నర్సన్న, మహేశ్, జాన్, తిమ్మప్ప, ఉపాధ్యాయులు ప్రసన్నకుమార్, వెంకట్రాములు, వీరన్న, నాగరాణి తదితరులు ఉన్నారు.
అన్ని మతాలకు ఆప్తుడు కేసీఆర్
సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మున్సిపాలిటీ చైర్పర్సన్ కరుణ మసీదులు, చర్చిలు, దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్ని మతాలను ఆదరించే సీఎం కేసీఆర్ నిండు నూరేండ్లు జీవించాలని కోరుకున్నారు. ముందుగా కేక్ను కట్ చేసి అభిమానులకు, కార్యకర్తలకు ఆమె పంచిపెట్టా రు. కార్యక్రమంలో నాయకులు వడ్డేపల్లి సూరి, మతపెద్దలు రఫీ, అస్లాం షరీఫ్, మగ్బూల్ పాల్గొన్నారు.
ధరూర్లో..
సీఎం జన్మదినాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జెడ్పీటీసీ పద్మావెంకటేశ్వర్రెడ్డి కేక్ కట్చేసి విద్యార్థులకు, నాయకులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నజుమున్నిసాబేగం, వైస్ఎంపీపీ పచ్చర్ల సుదర్శన్రెడ్డి, సర్పంచ్ పద్మమ్మ, ఎంపీటీసీ దౌలన్న, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్రెడ్డి, జాంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, విజయసింహారెడ్డి, మల్లికార్జున్రెడ్డి, రంగస్వామి, అబ్రహం, శ్రీరాములు, టీఆర్ఎస్ యూత్ నాయకులు జాంపల్లె భరతసింహారెడ్డి, భీమేశ్, నాయకులు కార్యకర్త లు పాల్గొన్నారు.
ఇటిక్యాలలో..
దేశం గర్వించదగ్గ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాజీ పార్లమెంట్ సభ్యుడు టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మంద జగన్నాథం కొనియాడారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా కొండేర్ గ్రామంలో టీఆర్ఎస్ నాయకులతో కలిసి కేక్కట్చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ అలంపూర్ నియోజకవర్గ మాజీ ఇన్చార్జి మందశ్రీనాథ్, రామిరెడ్డి, గిడ్డారెడ్డి, సర్పంచ్ వీరన్న, బలరాం, అంజి, యోహాన్, వీరన్న తదితరులు ఉన్నారు.
బలిగెరలో
తెలంగాణ ప్రజలు చేసుకున్న పుణ్యంవల్లే కేసీఆర్ సీఎం అయ్యారని బలిగెర జెడ్పీటీసీ బాసు శ్యామల పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. రైతువేదిక ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో బలిగెర సర్పంచ్ బాసు హనుమంతు, ఎంపీటీసీ రూపవతి, ఉపసర్పంచ్ హనుమంతు, నాయకులు కిష్టప్ప, సామేల్, నూర్పాషా, బజారి, కృష్ణారెడ్డి, రాజు, డేవిడ్, ఈరన్న, భీమన్న తదితరులు పాల్గొన్నారు. గట్టులో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి కేక్ కట్ చేశారు. ఆరగిద్దలో స్థానిక సర్పంచ్ యోగేశ్వరి, పీఏసీసీఎస్ చైర్మన్ క్యామ వెంకటేశ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులకు పండ్లు పంపిణీ చేశారు.