గద్వాల, నవంబర్ 29: ఉచిత విద్యుత్, సాగునీరు, రైతుబంధు, రైతుబీమా అందజేసి ప్రతిఒక్కరికీ పని కల్పించి వలసలను నివారించిన ఏకైక రాష్ట్రం తెలంగా ణ అని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నా రు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ సంక్షేమఫలాలు అందుతున్నాయని పేర్కొన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో కల్యాణలక్ష్మి చె క్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జెడ్పీచైర్పర్సన్ సరితతో కలిసి మంత్రి చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షాలు మాత్రం ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆరాట పడుతున్నాయని ధ్వజమెత్తారు. భవిష్యత్లో తెలంగాణలో ఏర్పడే ప్రభుత్వం తమదేనని బీజేపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని, కానీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. ఇప్పటికైనా ఆ పార్టీ నాయకులు పగటి కలలు కనడం మానుకోవాలని సూచించారు. మరో పార్టీ ఖాళీ డబ్బాలో రా ళ్లు ఊపుతున్నదని విమర్శించారు.
దేశంలోని బీజేపీ, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లోని అభివృద్ధిని, రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతిని బేరీజు వేసుకోవాలన్నారు. వ్యవసాయం, వైద్యం, విద్యారంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీ ట వేశారన్నారు. గట్టు ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించగా.. పనులు జరుగుతున్నాయని పే ర్కొన్నారు. దీక్షాదివస్ రోజున కల్యాణలక్ష్మి చెక్కులు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. గద్వాల జి ల్లాకూ త్వరలో మెడికల్ కళాశాలను సీఎం కేసీఆర్ మం జూరు చేయనున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ అపూర్వచౌహాన్, వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, మున్సిపల్ చైర్మన్ కేశవ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ జంబురామన్గౌడ్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పీఏసీసీఎస్ చైర్మన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
33/100కేవీ సబ్స్టేషన్ ప్రారంభం
మండలంలోని ఉప్పేరులో 33/100కేవీ సబ్స్టేషన్ను వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సరితతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకున్న పాపానపోలేదని, నేటికీ దేశంలో ఉన్న కేంద్రప్రభుత్వం రైతు సంక్షేమానికి పాటుపడటం లేదన్నారు. కానీ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషిచేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ గత పాలకులు గద్వాలలో ప్రగతిని గాలికొదిలేసి రైతులను అప్పులపాలు చేసి భూములు గుంజుకున్న పరిస్థితి ఉండేదన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో గద్వాల ప్రగతిపథంలో దూసుకెళ్తుందన్నారు. జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ వ్యవసాయాన్ని పండుగగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే సాధ్యమన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ పద్మావెంకటేశ్వర్రెడ్డి, ఎంపీపీ నజుమున్నిసాబేగం, వైస్ఎంపీపీ సుదర్శన్రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రామన్గౌడ్, ఎంపీటీసీ రేణుక, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డీఆర్ విజయ్కుమార్, పాగుంట ఆలయ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, డీఈ భాస్కర్, నాయకులు కృష్ణారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, జాకీర్, సర్వారెడ్డి, ప్రభాకర్గౌడ్, హనుమంతురెడ్డి, యూత్ అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, ప్రదానకార్యధర్శి సంజీవ్, ఉపాధ్యక్షులు భరతసింహారెడ్డి, పోలు కృష్ణారెడ్డి, నరేశ్, రైతులు పాల్గొన్నారు.
సీఎం సభకు దండులా కదలాలి
మహబూబ్నగర్లో డిసెంబర్ 4న సీఎం కేసీఆర్ పర్యటిస్తారని, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీశ్రేణులు, ప్రజలు దండులా కదలిరావాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం పర్యటన నేపథ్యంలో మంగళవారం పెబ్బేరులోని ఓ ఫంక్షన్హాల్లో పెబ్బేరు, శ్రీరంగాపురం మండలాలకు చెం దిన ముఖ్య కార్యకర్తలు, నాయకులతో మంత్రి సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. సభలో వనపర్తి జిల్లా కార్యకర్తలు ప్రత్యేకంగా నిలవాలన్నారు. సమావేశంలో గిడ్డంగుల శాఖ చైర్మన్ సాయిచంద్, టీఆర్ఎస్ శిక్షణా తరగతుల జిల్లా కన్వీనర్ పురుషోత్తంరెడ్డి, ఎంపీపీలు శైలజ, గాయిత్రి, మున్సిపల్ చైర్మన్ కరుణశ్రీ, వైస్చైర్మన్ కర్రెస్వామి, పార్టీ మండల అధ్యక్షుడు రాములు, పట్టణ అధ్యక్షుడు దిలీప్రెడ్డి, శ్రీరంగాపురం విండో అధ్యక్షుడు జగన్నాథంనాయుడు, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు, బుచ్చారెడ్డి, శ్యామల, నాయకులు పెద్దింటి వెంకటేశ్, హరిశంకర్నాయుడు తదితరులు పాల్గొన్నారు.