అమరచింత, జూన్ 18 : క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం నిర్వహించిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు శనివారం నిర్వహించిన అభినందన, గ్రామసభలతో ముగిశాయి. అమరచింత మున్సిపాలిటీలో చైర్పర్సన్ మంగమ్మ, కమిషనర్ రమేశ్ అన్ని వార్డుల్లో పనులను పర్యవేక్షించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులను సన్మానించారు. కార్యక్రమంలో పట్టణ ప్రత్యేకాధికారి శ్రీపాదరామేశ్వర్, వైస్చైర్మన్ గోపి, మార్కెట్ కమిటీ మాజీ వైస్చైర్మన్ నాగభూషణంగౌడ్తోపాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. కొంకనివానిపల్లిలో తాసిల్దార్ సింధూజ పర్యటించారు. అనంతరం గ్రామసభ నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ అంకె వెంకటన్న, ఎంపీటీసీ శకుంతలమ్మ, ఆర్ఐ గోపాల్, వీఆర్వో శివకుమార్ తదితరులు ఉన్నారు.
పల్లె ప్రగతిని పరిశీలించిన ఎంపీపీ
మండలంలోని అంకూర్, వెంకటాపురం గ్రామాల్లో నిర్వహిస్తున్న పల్లెప్రగతి కార్యక్రమాలను ఎంపీపీ కిచ్చారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అం కూర్ గ్రామ పంచాయతీలో జరుగుతున్న పనుల వివరాలు కార్యదర్శి కృష్ణను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంకూర్, వెంకటాపురం గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రా న్ని సందర్శించి చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఆయాగ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పనులు పరిశీలించిన వైస్చైర్మన్
ప్రభుత్వం చేపడుతున్న పట్టణ ప్రగతి తో సమస్యలు పరిష్కారం కావడంతోపాటు రూపురేఖలు మారుతున్నాయని మున్సిపల్ వైస్చైర్మన్ వాకిటి శ్రీధర్ అన్నారు. వర్షాకాలాన్ని దృష్టి లో ఉంచుకుని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని పలు ప్రధాన కాల్వల్లో సిల్ట్ తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. శనివారం సిల్ట్ తొలగింపు పనులను ఆయన పరిశీలించి మున్సిపాలిటీ సిబ్బందికి పలు సూచనలను చేశారు. ఆయన వెంట పట్టణ నాయకులు ఉన్నారు.
పచ్చదనం మన ప్రగతికి సంకేతం
పచ్చదనం మన ప్రగతకి సంకేతమని మున్సిపల్ చైర్పర్సన్ కరుణశ్రీ. అన్నారు. శనివారం పట్టణంలోని 3,5,6,7,8,9,11,12 వార్డులో ఇంటింటికీ ఆరు మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం వివిధ వార్డులో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో వార్డుల రూపురేఖలను మారుస్తున్నాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ కర్రెస్వామి, కమిషనర్ జాన్ కృపాకర్, కౌన్సిలర్లు రామకృష్ణ, ఎల్లారెడ్డి, సుమతి, పార్వతి, కో ఆప్షన్ సభ్యుడు ఎండీ ముస్తాక్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పల్లెప్రగతితో గ్రామాలు అభివృద్ధి
పల్లెప్రగతితో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని మండల ప్రత్యేకాధికారి మల్లికార్జున్ అన్నారు. శనివారం మండలంలోని భౌసింగ్తండా, కొత్తపల్లి గ్రామాలను ఎంపీడీవో నాగేంద్రంతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధియే కాకుండా మొక్కల పెంపకానికి సర్పంచులు చూపిస్తున్న చొరవ అభినందనీయం అన్నారు. కార్యక్రమంలో ఎంపీవో పుష్ప, సర్పంచులు అరుణ, రమేశ్, మాసన్న తదితరులు పాల్గొన్నారు.
వైకుంఠధామాలు వినియోగంలోకి తేవాలి
ప్రభుత్వం ప్రతి గ్రామంలో నిర్మించిన వైకుంఠధామాలను వినియోగంలోకి తేవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నర్సింహులు సూచించారు. పల్లెప్రగతిలో భాగంగా శనివారం ఆయన పెబ్బేరు మండ లం కొత్తసూగూరులో పర్యటించారు. గ్రామంలోని వైకుంఠధామం, సెగ్రిగేషన్షెడ్డు, పల్లెప్రకృతి వనం, నర్సరీలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్కుమార్, స ర్పంచ్ జూదం వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
పల్లె ప్రగతిపై ప్రత్యేక గ్రామసభ
మండలంలో పల్లె ప్రగతి కార్యక్రమాలు ముగింపు సందర్భంగా శనివారం పలు గ్రామాల్లో ప్రత్యేక గ్రామసభలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 5వ విడుత పల్లె ప్రగతి మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు చేసిన పనుల వివరాలు సభలో ప్రత్యేకాధికారులు వివరించారు. కంభాళాపూర్లో గ్రామసభ అనంతరం ప్రత్యేకాధికారి డీటీ శివకుమార్, సర్పంచ్ మంజుల, పారిశుధ్య కార్మి కులను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమం లో ఎంపీటీసీ ఎల్లస్వామి, టీఆర్ఎస్ నాయకుడు రాజవర్ధన్రెడ్డితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పారిశుధ్య కార్మికులకు సన్మానం
పల్లె ప్రగతి ముగింపు కార్యక్రమం లో భాగంగా శనివారం మండలంలోని అన్ని గ్రామాల పం చాయతీ కార్యాలయాల్లో సర్పంచుల అధ్యక్షతన గ్రామ సభ లు నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులను సన్మానించారు. పల్లె ప్రగతిలో చేపట్టిన కార్యక్రమాలపై అధికారులు వివరించారు. పల్లె ప్రగతికి సహకరించిన అధికారులు, ప్రజాప్రతినిధులకు మండల ప్రత్యేకాధికారి అనిల్కుమార్, ఎంపీడీవో కరుణశ్రీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మంద భార్గవి, ఎంపీవో హుస్సేనప్ప, ఏపీవో నరేందర్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ లు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.