గద్వాలటౌన్, మే 2 : జనన, మరణ ధ్రువపత్రాల కోసం దరఖాస్తుదారులు ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేదు. సర్టిఫికెట్ల కోసం డబ్బులు ముట్టచెప్పనవసరం లేదు. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోపే ధ్రువీకరణ పత్రాలను పొందే అవకాశం కల్పించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్లో వివరాలు నమోదు చేసుకోవచ్చు. దవాఖానలు, వైకుంఠధామాల వద్ద జనన, మరణ వివరాలు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించింది. దరఖాస్తు లేకుండానే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు రూపొందించిన యాప్పై సంబంధిత సిబ్బందికి ఆయా మున్సిపాలిటీల్లో ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. సిబ్బంది వద్ద ఉన్న ఫోన్కు యాప్ను అనుసంధానం చేశారు. ఇందుకుగానూ యూజర్ ఐడీ, పాస్వర్డ్ కేటాయించారు.
ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో పుట్టిన పిల్లల వివరాలను 24 గంటల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. అప్పుడే పుట్టిన బిడ్డకు పేరు ఉండదు.. కావున 21 రోజులు దాటిన తరువాత ఎప్పుడైనా మీ సేవ కేంద్రాల్లో పేరును నమోదు చేసుకోవచ్చు. ఇందుకుగానూ అన్ని దవాఖానలకు ప్రత్యేకంగా యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చారు. దవాఖానల్లో వి వరాలు నమోదు చేసిన వెంటనే తల్లిదండ్రుల ఫోన్ నెంబర్కు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం వస్తుం ది. అందులోని లింక్ ద్వారా సర్టిఫికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మరణ ధ్రువీకరణ పత్రాల జారీ కోసం కూడా యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చారు. దవాఖానల్లో మరణించిన వారి వివరాలను ఆసుపత్రి వర్గాలు నమోదు చేస్తాయి. ఇండ్ల వద్ద మరణించిన వారి వి వరాలను వైకుంఠధామల వద్ద నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. వివరాలు నమోదు చేసిన వెంటనే ఫోన్కు సమాచారం వస్తుంది. లింక్ ద్వారా సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
తప్పులు సవరించుకోవచ్చు..
ధ్రువీకరణ పత్రాల్లో తప్పులు దొర్లకుండా దవాఖానలు, వైకుంఠధామల వద్ద దరఖాస్తుదారులు వి వరాలు నమోదు చేసుకోవాలి. ఒకవేళ తప్పులు ఉంటే సరిచూసుకోవచ్చు. రికార్డులో నమోదు కాని వారుంటే పాత విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్ అనుగుణంగా వివరాలు నమోదు చేసుకోవాలి. తప్పులు ఉంటే ఫోన్కు వచ్చిన సర్టిఫికెట్ నం బర్ ఆధారంగా ఈ సేవ, మీసేవ కేం ద్రాల్లో సవరించుకోవచ్చు.