గద్వాల టౌన్/మహబూబ్నగర్టౌన్, మే 2 : ముస్లింల పవిత్ర రంజా న్ మాసం ముగిసింది. 30 రోజుల ఉపవాస దీక్ష అద్భుతంగా సాగింది. సో మవారం సాయంత్రం దీక్షలు విరమించారు. మంగళవారం రంజాన్ పండుగ జరుపుకొనేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం ప్రారంభం కానున్న షవ్వాల్ మా సం మొదటి రోజు ఈద్-ఉల్-ఫిత్ నిర్వహించనున్నారు. అందుకుగా నూ ఉమ్మడి జిల్లాలోని మసీదులు, ఈద్గాలు సుందరంగా ముస్తాబయ్యాయి. పండుగ సా మగ్రిని కొనుగోలు చేసేందుకు మహిళలు పోటీపడ్డారు. టోపీలు, అత్తర్, మిస్వాల్ను ముస్లింలు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేశారు. దీంతో పట్టణాలు సందడిగా మా రాయి. పండుగ తరువా త మరో ఆరు రోజులపాటు షవ్వాల్ దీక్షలు చేపడుతారు.
ఫిత్ దానం..
పండుగ రోజున న మాజ్కు ముందు పేదలకిచ్చే దానం ఫిత్.్ర అందుకే ఈ పండుగకు ఈద్-ఉల్-ఫిత్ అని పేరు వచ్చినట్లు ముస్లిం మత పెద్దలు చెబుతున్నారు. రెండున్నర సేర్ల గోధుమలు లేదా వా టి బరువుకు తగిన డబ్బులు లేదా ఏదైనా వస్తువు రూపంలో పేదలకు దానం చేయాలని అంటున్నారు.
షీర్కుర్మా ప్రత్యేకం..
రంజాన్ పండుగ వస్తే అందరి కండ్లు షీర్ఖుర్మాపైనే ఉంటాయి. రంజాన్కు, షీర్ఖుర్మా కు విడదీయరాని బంధం ఉన్నది. రంజాన్ రోజున ప్రతి ముస్లిం కుటుంబంలో షీర్ఖుర్మా తయారు చేయడం ఆనవాయితీ. నమాజ్కు ముందు తీపి తినాలన్న నిబంధనలు ఉన్నా యి. కొందరు ముస్లింలు వారి సన్నిహితులను ఇంటికి పిలిచి షీర్ఖుర్మా తినిపించి ఆత్మీయతను చాటుకుంటారు. రెండేండ్లుగా కరోనా కారణం గా భౌతిక దూరం పాటిస్తూ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలుపుకున్నా రు. కాగా, ఈ ఏడాది కరోనా కనుమరుగు కావడంతో ఈద్ నమాజ్ ఈద్గాలో చేయనున్నారు. మహబూబ్నగర్లోని వానగుట్టలో ఉన్న రహెమాని ఈద్గాలో ఉదయం 9 గంటలకు ఈద్ నమాజ్ ఆచరించనున్నారు. మదీ నా మసీద్లో 8:30కు, సిరాజుల్ ఉలుమ్లో ఉదయం 7 గంటలకు ఈద్ నమాజ్ ఉంటుం ది. ఆయా ప్రాంతాల్లో అక్కడి ఈద్గాలు, మసీదుల్లో నమాజ్ చేయనున్నారు.
శుభాకాంక్షలు తెలిపిన మంత్రి..
రంజాన్ను పురస్కరించుకొ ని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి పండుగ శుభాకాంక్ష లు తెలిపారు. మంగళవారం ఉదయం ర హెమాని ఈద్గాలో మంత్రి, ఎంపీ ప్రార్థన చేయ నున్నారు.