గద్వాలటౌన్, ఏప్రిల్ 9 : ఉమ్మడి జిల్లాలోని ప్ర తి గ్రామంలో శ్రీరామనవమి వేడుకలకు ఆలయా లు ముస్తాబయ్యాయి. కొబ్బరి మట్టలు, మామిడి ఆకులు, పూలతో కల్యాణ వేదికలను సుందరంగా తీర్చిదిద్దారు. అందులోభాగంగా గద్వాల కోటలోని రామాలయం, గంజిపేటలోని వేంకటేశ్వరస్వామి, రామాలయం, రాంనగర్లోని రామాలయం, పీజేపీ క్యాంపులోని వేంకటేశ్వరస్వామి ఆలయం, పెద్ద అగ్రహారం అహోబిల మఠంలోని లక్ష్మీనృసింహస్వామి వారి సన్నిధి, రామాంజనేయస్వామి ఆలయం, సంగాల గ్రామంలోని రామాలయంతోపాటు ఆంజనేయస్వామి ఆలయాల్లో సీతారాముల కల్యాణానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే కల్యాణం సందర్భంగా ఆలయాల్లో హరినామ సంకీర్తనలు, భక్తి సంగీతా కార్యక్రమలు నిర్వహించనున్నారు. కాగా, శ్రీరామనవమి ఉత్సవాలు శనివారం నుంచే ప్రారంభమయ్యాయి. కల్యాణోత్సవం ముందురోజు ఆయా ఆలయాల్లో చలువ పందిర్లతోపాటు పెళ్లి పందిరిలను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉ దయం 6 గంటల నుంచే పూజలు ప్రారంభంకానున్నాయి. సుప్రభాత సేవ, మూల విగ్రహాలకు విశేష ఫల పంచామృతాభిషేకాలు, ఊంజల్ సేవలు, సీతారామస్వామి క ల్యాణోత్సవం, స్వామి వారి రథోత్సవం, మహామంగళహారతి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్వాహకులు సన్నద్ధమయ్యారు. శ్రీరామ నవమిని పురస్కరించుకొని జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలల్లో నవమి వేడుకల ను ఘనంగా జరుపుకొన్నారు. చిన్నారులు సీతారాముల వే షదారణలో ఆకట్టుకున్నారు.