గద్వాల, ఏప్రిల్ 3 : జోగుళాంబ గద్వాల జిల్లాలో విద్యా రంగానికి మహర్దశ పట్టనున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రైవేట్కు దీటుగా విద్యను అందించడానికి ‘మన ఊరు మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో పాఠశాలలు బలోపేతం కానున్నాయి.
161 పాఠశాలలు ఎంపిక
జిల్లాలో మొత్తం 461 పాఠశాలలున్నాయి. ఇందులో 286 ప్రాథమిక పాఠశాలల్లో 27,814 మంది విద్యార్థులు, ప్రాథమికోన్నత పాఠశాలలు 82 ఉండగా అందులో 12,925 మంది విద్యార్థులు, ఉన్నత పాఠశాలలు 93 ఉండగా ఇందులో 30,554 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. జిల్లా మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో 71,293 మంది విద్యార్థులున్నారు. జిల్లాలో 161 పాఠశాలలను మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేయనున్నారు. ఇందులో పీఎస్లు
81, యూపీఎస్లు 28, ఉన్నతపాఠశాలలు 52 ఉన్నాయి. కార్యక్రమం ద్వారా జిల్లాలో 41,109 మంది విద్యార్థులకు సౌకర్యాలు కలగనున్నాయి.
మండలాల వారీగా ..
జిల్లాలో మండలాల వారీగా మన ఊరు-మన బడి కార్యక్రమానికి ఎంపికైన పాఠశాలలు.. కేటిదొడ్డి 12, ధరూర్ 15, గద్వాల 23, ఇటిక్యాల 18, మల్దకల్13, గట్టు
17, అయిజ 19, రాజోళి 8, వడ్డెపల్లి 9, మానవపాడ్ 8, ఉండవెల్లి 8, అలంపూర్ 11 పాఠశాలలు ఉన్నాయి.
సౌకర్యాలు ఇలా..
మన ఊరు -మన బడికి ఎంపికైన పాఠశాలల్లో ప్రభుత్వం బాలుర,బాలికలకు వేర్వేరుగా నీటి సౌకర్యంతో టాయిలెట్లు..
ప్రతి పాఠశాలలకు విదుద్దీకరణ
విద్యార్థులకు,ఉపాధ్యాయిలకు సరిపోయే ఫర్నిచర్ అందించడంతో గ్రంథాలయం ఏర్పాటు
మిషన్భగీరథ నీటి సౌకర్యం
పాఠశాలలకు రంగులు వేడయం గోడలపై దేశ,రాష్ట్ర ప్రముఖుల చిత్రాలతో పాటు పాఠ్యానికి సంబంధించిన అంశాలు చిత్రించడం..
గ్రీన్ చాక్పీస్ బోర్డులు ఏర్పాటు
పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మాణం
కిచెన్ షెడ్డుల నిర్మాణం
శిథిలమైన తరగతి గదుల స్థానంలో కొత్తవాటిని నిర్మించడం
పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన సమయంలో వడ్డించేందుకు వీలుగా డైనింగ్ హాల్ నిర్మాణం
ప్రొజెక్టర్ల ద్వారా విద్యా బోధన
ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం..
‘మన ఊరు -మన బడి’ కోసం జిల్లాలో 161 పాఠశాలలు ఎంపిక చేశారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమం
ప్రవేశపెట్టనున్నారు. గ్రామీణ పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రభుత్వ నిర్ణయం హర్షనీయం. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్య
అందుతుంది.
– డీఈవో, సిరాజుద్దీన్, జోగుళాంబగద్వాల