ప్రతిరోజూ ట్రాక్టర్కు ఆరుగురు కూలీలు అవసరం ఉండగా ఒక్కో కూలీకి రూ.300 చెల్లిస్తున్నారు. ఉదయం 10 నుంచి 2గంటలలోపే పనులు పూర్తి చేస్తున్నారు. పంట కాలం ముగిసిన వెంటనే పొలం వానకాలానికి సిద్ధం చేసుకోవాలంటే ఏటా పంట వ్యర్థాలను కాల్చి వేసేందుకు రైతులకు కూలీల అవసరం ఉండేది. అలాంటిది ఎలాంటి కూలీలు లేకుండా చెత్తను ముక్కలుగా చేసి ట్రాక్టర్లో తరలించడంతో రైతులకు పొలంలో చెత్త తొలగిపోయి శుభ్రంగా మారుతున్నది. రైతులు పొలంలో పత్తి మొక్కలను ట్రాక్టర్ గుంటక సహాయంతో తొలగించిన వెంటనే వ్యర్థాలను తరలించే ట్రాక్టర్ యువకులకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసిన రైతు పొలం వద్ద ట్రాక్టర్ఉంచి చెత్తను తరలిస్తున్నారు. ఇలా వ్యర్థాలను పవర్ ఉత్పత్తికి వాడుకునేందుకు తరలిస్తుండడంతో ఉపాధితోపాటుగా రైతులకు కలిసిస్తోంది.
ఇటిక్యాల, మే 25: పంట పొలాల్లో పంటకాలం ముగియగానే పంట వ్యర్థాలను పొలాల్లోనే కాల్చివేయడం సర్వసాధారణం. అయితే పంట వ్యర్థాలు పవర్ ఉత్పత్తికి ఉపయోగపడుతుండడంతో ప్రస్తుతం పంట వ్యర్థాలను పవర్ప్లాంట్కు తరలిస్తూ చాలామంది యువకులు ఉపాధి పొందుతూ పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు. మండలంలోని తిమ్మాపూర్ సూర్యతేజ పవర్ప్లాంట్ వారు విద్యుదుత్పత్తికి పంట వ్యర్థాలను ఉపయోగించుకునేందుకు 20 యంత్రాలను తయారు చేయించారు. ఒక్కో యంత్రం రూ.4లక్షలు వెచ్చించి తయారు చేయించారు. ఈ యంత్రాలను గ్రామాల్లో ట్రాక్టర్ ఉన్న యువతకు రూ.50వేల డిపాజిట్తో అందజేశారు. ట్రాక్టర్కు బిగించి నడిపే ఈ యంత్రాలలో పత్తి, మిరప పంటల వ్యర్థాలను యంత్రంలోకి పంపిస్తే ఆ యంత్రం వ్యర్థాలను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ట్రాక్టర్ ట్రాలీలో పోస్తుంది. ఇలా ముక్కలుగా మార్చిన వ్యర్థాలను పవర్ప్లాంట్కు తరలిస్తే టన్ను రూ.1500లకు ప్లాంట్ వారు కొనుగోలు చేస్తున్నారు. ట్రాక్టర్లో ప్రతి రోజూ నాలుగు నుంచి ఐదు టన్నుల వ్యర్థాలు ప్లాంట్కు తరలిస్తారు. కూలీలకు రూ.1800, డీజిల్కు రూ.1200 పోనూ ప్రతిరోజూ రూ.3వేల నుంచి 4వేలు ట్రాక్టర్ యజమానికి మిగులుతున్నాయి.
ఎంతో మందికి ఉపాధి
ప్రతిరోజూ ట్రాక్టర్కు ఆరుగురు కూలీలు అవసరం ఉండగా ఒక్కో కూలీకి రూ.300 చెల్లిస్తున్నారు. ఉదయం 10 నుంచి 2గంటలలోపే పనులు పూర్తి చేస్తున్నారు. పంట కాలం ముగిసిన వెంటనే పొలం వానకాలానికి సిద్ధం చేసుకోవాలంటే ఏటా పంట వ్యర్థాలను కాల్చి వేసేందుకు రైతులకు కూలీల అవసరం ఉండేది. అలాంటిది ఎలాంటి కూలీలు లేకుండా చెత్తను ముక్కలుగా చేసి ట్రాక్టర్లో తరలించడంతో రైతులకు పొలంలో చెత్త తొలగిపోయి శుభ్రంగా మారుతున్నది. రైతులు పొలంలో పత్తి మొక్కలను ట్రాక్టర్ గుంటక సహాయంతో తొలగించిన వెంటనే వ్యర్థాలను తరలించే ట్రాక్టర్ యువకులకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసిన రైతు పొలం వద్ద ట్రాక్టర్ఉంచి చెత్తను తరలిస్తున్నారు. ఇలా వ్యర్థాలను పవర్ ఉత్పత్తికి వాడుకునేందుకు తరలిస్తుండడంతో ఉపాధితోపాటుగా రైతులకు కలిసిస్తోంది.
ఉపాధి దొరుకుతుంది
నేను ట్రాక్టర్తో రోజూ 4 నుంచి 5టన్నుల పంట వ్యర్థాలను పవర్ప్లాంట్కు తరలిస్తాను. రైతులు తమ పొలాలు శుభ్రపడుతాయని పత్తి మొక్కలను ట్రాక్టర్ గుంటకతో తొలగించిన వెంటనే ఫోన్ చేసి చెబుతారు. ఖర్చులు పోనూ ప్రతి రోజూ రూ.3వేల నుంచి రూ.4వేలకు మిగులుతాయి.