ఊట్కూర్, మే 21 : మండలంలోని పగిడిమర్రిలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు కొసాగుతున్నాయి. శుక్రవారం పనులను సర్పంచ్ సులోచన, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి పరిశీలించారు. జీపీ నిధులతో మెయిన్ రోడ్డు పక్కన నిర్మిస్త్తున్న అండర్ గ్రౌండ్ నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. గ్రామంలో దశల వారీగా సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణ పనులు పూర్తి చే స్తామన్నారు.. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి గోవర్ధన్, ఉపసర్పంచ్ మహబూబ్ అలీ, మురళీధర్రెడ్డి, విష్ణుమూర్తిగౌడ్, సత్యనారాయణగౌడ్ పాల్గొన్నారు.