ఊట్కూర్, మే 21 : కరోనా నియంత్రణలో భాగంగా విధించిన లాక్డౌన్ కారణంగా గురువారం రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రతి రోజూ ఉదయం 10 గంటల వరకు దుకాణాలు తెరచి ఉంచడం వల్ల ఆ సమయంలో మాత్రమే ప్రజలు తమ పనులు ముగించుకుని ఇండ్లకు వెళ్లి పోతున్నారు. పక్షం రోజుల కిందట వైరస్ బారిన పడి ఇటీవల కోలుకున్న అనంతరం తాసిల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ రాఘవేందర్రెడ్డి శుక్రవారం తిరిగి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ప్రజలు భయాందోళన చెంద వద్దని..ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తే వైరస్ నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. అత్యవసరమైతేనే ఇండ్ల నుంచి బయటకు రావాలని, ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని భౌతికదూరం పాటించాలని ఆయ న సూచించారు.