దాతల సహకారంతో 10 ఆక్సిజన్ సిలిండర్లు : ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి
గద్వాల, మే 15 : జిల్లాలో రోజురోజుకూ కరోనా వ్యాప్తి పెరుగుతుందని ప్రజలంద రూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని జిల్లా దవాఖానకు దాతలు 10 ఆక్సిజన్ సిలిండర్లు వితరణ చేయగా వాటిని డీఎంహెచ్వో చందునాయక్కు ఎమ్మెల్యే కృ ష్ణమోహన్రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. దవాఖానలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఉందని జిల్లా వైద్యాధికారి తన దృష్టికి తీసుకొచ్చారని దాతల స హకారంతో ఆక్సిజన్ల కొరత తీర్చానని చెప్పారు. ఆక్సిజన్లు అందించిన దాతలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపా రు. దవాఖానకు వచ్చిన ఆక్సిజన్ సి లిండర్లను వైద్యులు సక్రమంగా వినియోగించి కొవిడ్ రోగుల ప్రాణాలు కా పాడాలని సూచించారు. బాధితులకు అవసరమైన బెడ్స్, ఆక్సిజన్, మందు లు అన్ని దవాఖానలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. దవాఖానకు కావాల్సిన ఆక్సిజన్ సిలిండర్లు, రెమ్డిసివిర్ టీకా లు, టెస్ట్లు చేసే పరికరాలు, పీపీఈ కి ట్లు ఏది అవసరం ఉన్న తన దృష్టికి తీ సుకొస్తే సీఎం కేసీఆర్తోపాటు వైద్య ఆరోగ్యశాఖ అధికారుల దృష్టికి తీసుకె ళ్లి సమకూర్చడం జరుగుతుందని చె ప్పారు. అనంతరం ఎమ్మెల్యే కరోనా వార్డులో తిరిగి బాధితుల ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. వై ద్యం కోసం వచ్చిన వృద్ధురాలితో మా ట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. సోమవారం నుంచి దవాఖాన లో ఉండే బాధితులకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. సిలిండర్లు వితరణ చేసిన సుదర్శన్రెడ్డి, తిమ్మారెడ్డి, ఆలూరి రా ము, సంకపురం రాముడు, రామచంద్రారెడ్డి, రాఘవేందర్, గట్టు ఈశ్వర య్య, వెంకట్రామిరెడ్డిని ఎమ్మెల్యే అభినందించారు. ఎమ్మెల్యే వెంట జిల్లా వై ద్యాధికారి చందునాయక్, ఆర్ఎంవో వృశాలి, పురపాలక చైర్మన్ బీఎస్ కేశవ్, ఎంపీపీలు విజయ్కుమార్, ప్ర తాప్గౌడ్, జెడ్పీటీసీ రాజశేఖర్, కౌన్సిలర్ శ్రీను తదితరులు ఉన్నారు.