గద్వాల: రైతు కుటుంబాలకు చేయూతనివ్వడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గట్టు మండల కేంద్రానికి చెందిన తిమ్మప్ప అనారోగ్యంతో మరణించగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున మంజూరైన రైతు బీమా రూ.5లక్షల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు అకస్మాత్తుగా మరణిస్తే వారి కుటుంబం ఇబ్బందులు పడకూడదనే మంచి ఉద్ధేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బీమా పథకం ప్రవేశ పెట్టి వారి కుటుంబాలకు చేయూతనిస్తున్నారన్నారు. రైతుకు సెంటు పొలం ఉన్న రైతుబీమా వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, రైతు బీమా కోసం ప్రభుత్వం రైతుల పేరు మీద ప్రీమియం చెల్లిస్తుందని తెలిపారు.
ప్రభ్వుం అందించే ఈ సహాయాన్ని రైతు కుటుంబాలు వినియోగించుకోవాలని సూచించారు. రైతుల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. తెలంగాణలో రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, దీంతో పాటు ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా పని చేస్తున్నదన్నారు. అనారోగ్యోంతో ఉన్న వారికి మెరుగైన చికిత్స అందించడానికి సీఎంఆర్ఎఫ్ను మంజూరు చేస్తుందన్నారు.
ధరూర్ మండలం ఉప్పేరు గ్రామానికి చెందిన కృష్ణయ్యగౌడు అనారోగ్యానికి గురి కాగా అతనికి మంజూరైన రూ2,15, 800 చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేశవ్, ఎంపీపీ ప్రతాప్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ సుభాన్, ధరూర్ వైస్ ఎంపీపీ సుదర్శన్రెడ్డి, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సంజీవులు, నాయకు లు సర్వారెడ్డి, వెంకట్రామిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, సుధాకర్రెడ్డి, వంశీ, రామకృష్ణారెడ్డి, బజారి, రాము పాల్గొన్నారు.