గద్వాల: పేద ప్రజలకు అండగా ఎల్లప్పుడు గులాబీ జెండా ఉంటుందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ భవనంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
పార్టీ ఆవిర్భవించి 20సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 15న వరంగల్లో విజయనగర సభను ఏర్పాటు చేస్తున్నారని ఈ సభకు గద్వాల నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో టీఆర్ఎస్ అభిమానులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
గతంలో ఏ ప్రభుత్వాలు రైతుల గురించి పట్టించుకోలేదని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తర్వాత పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి వారికి చేయూతనిచ్చారని చెప్పారు. ఉద్యమ సమయం లో ప్రజల కష్టాలు తెలుసుకున్న ముఖ్య మంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కష్టాలు విడుతల వారీగా పరిష్కరించారని, గ్రామాల అభివృద్ధి కోసం పల్లె ప్రగతి కార్యక్రమాలు చేపట్టి పల్లెను అభివృద్ధి చేసిందని తెలిపారు.
హరిత హారంలో భాగంగా చెట్లు నాటడంతో ప్రజలకు మంచి ఆక్సిజన్ అందించిన వారమయ్యామని తెలిపారు.కరోనా సమ యంలో రైతులు పండిం చిన పంటను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలు తెచ్చి రైతులకు ఇబ్బందులు కలిగేలా చేసిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధలరు పెంచి సామాన్యులకు అందనంత దూరంగా ఉం చిందన్నారు.
వరంగల్లో జరిగూ గర్జనకు ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు నూత నంగా ఎన్నికైన మండల పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఎమ్మెల్యే సన్మానించారు. సమావేశంలో ఎంపీపీ ప్రతాప్గౌ డ్, పీఏసీఎస్ చైర్మన్ సుభాన్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రామేశ్వరమ్మ, వైస్ ఎంపీపీ సంజీవులు, మండల పరిషత్ వైస్ ఎంపీపీ దామోదర్, సర్పంచ్లు అశోక్రెడ్డి, మజీద్ నాయకులు రమేశ్నాయిడు, వెంకట్రామిరెడ్డి, దామోదర్రెడ్డి, జయరామిరెడ్డి, బీచుపల్లి తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తల సంక్షేమమే ప్రధాన ఆశయం
ధరూరు: పేద ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహాన్రెడ్డి అన్నారు. మండల కేంధ్రంలోని జాంపల్లి ధగ్గర బీంరెడ్డి రైస్ మిల్లు దగ్గ ర ఏర్పాటు తెరాస విజయ గర్జన సభ సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహాన్రెడ్డి పాల్గొనగా మండల నాయకులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికి అభినంధనలు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతు ముందుగా ఇటీవల మండలంలోని వివిధ గ్రామాల్లో మరణించిన టీఆర్ ఎస్ శ్రేణులకు సంతాపం ప్రకటిస్తూ మౌనం పాటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 15న వరంగల్లో నిర్వహిస్తున్న విజయ గర్జన సభకు మండల, గ్రామ కమిటీలు భాధ్యత వహించి అత్యధిక సంఖ్యలో సభకు హాజరయ్యే విదంగా చూడాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతన కమిటి నాయకులను పరిచయం చేసి అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుదర్శన్రెడ్డి, ఎంపీపీ విజయ్ కుమార్, సర్పంచ్ రఘువర్ధన్రెడ్డి, పౌగుంట ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, రైతు బంధు సమి తి అధ్యక్షుడు ఈశ్వరయ్య, మండలాధ్యక్షుడువిజయ్, మహిళ అధ్యక్షురాలు సుజాత, ఎంపీటీసీ దౌలన్న, నాయకులు శ్రీనివాస్రెడ్డి, సర్వారెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, ప్రభాకర్గౌడ్, విజయ్రెడ్డి, శ్రీరాములు, రాఘవేంధ్రరెడ్డి, రంగస్వామి, ఈశ్వర్, మండల యూత్ ప్రధాన కార్యదర్శులు భరత్రెడ్డి, సంజీవ్, నరేశ్గౌడ్ పాల్గొన్నారు.