గద్వాల: మైనార్టీలకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుం దని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 28 మంది లబ్ధిదారులకు మంజూరైన షాదీముబారక్ చెక్కులను ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో మైనార్టీలకు ఇచ్చిన హామీలను ఒక్కోక్కటి విడతల వారీగా నెరవేర్చుతూ వస్తున్నాడని చెప్పారు. మైనార్టీ పిల్లలకు కార్పోరేట్ స్థాయిలో విద్యను అందించా లనే ఆలోచనతో వారి కోసం మైనార్టీ గురుకులాలను ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాపించారని చెప్పారు. మైనార్టీలకు 5శాతం రిజర్వేషన్ అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు. మజీద్లో పనిచేసే ఇమాంలకు గౌరవ వేతనం ఇస్తున్న ఎకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, పీఏసీఎస్ చైర్మన్ సుభాన్ , ఎంపీపీ ప్రతాప్గౌడ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సరోజమ్మ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రామేశ్వరమ్మ, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, కౌన్సిలర్లు నాగిరెడ్డి, మురళి, శ్రీమన్నారాయణ, దౌలు, మహేశ్, శ్రీను, నరహరి, శ్రీనివాసులు, నాయకులు రమేశ్ నాయిడు, కోడిగుడ్ల సలాం, వెంకట్రామిరెడ్డి, సాయిశ్యాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.