గద్వాల: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేనేత కార్మికుల కష్టాల తెలుసుకుని వారి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి చేనేత కార్మికులకు పెద్ద పీట వేశారని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బుర్ధపేటలో సమత సేవా సమితి ఆధ్వ ర్యంలో 20మంది మహిళలకు ఉచిత మగ్గం శిక్షణ అందించే కేంద్రాన్ని ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో గద్వాల పట్టు చీరలు ప్రసిద్ధి చెందాయని తెలిపారు. ఇక్కడి చేనేత కార్మికులకు దేశ వ్యాప్త గుర్తింపూ ఉందని చెప్పారు. చేనేత కార్మికులను గతంలో ఏ ప్రభుత్వాలు పట్టించుకోక పోవడం వల్ల వారు ఆర్థికంగా చితికి పోయారని చెప్పారు. అర్హులైనా చేనేత కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలనే మంచి ఆలోచనతో మగ్గాలకు జియో ట్యాగింగ్ చేయించి అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు.
ప్రస్తుతం ఈ శిక్షణా కేంద్రంలో 20 మంది మహిళలకు 45 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. శిక్షణ పొందిన మహిళలు స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలు గద్వాలలో అమలు పరిచే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి చేనేత కార్మికుడు ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రభుత్వం చేయూత నిస్తుందని తెలిపారు. ఇక్కడి చేనేత కార్మికుల స్థితి గతులను గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
మంత్రి కేటీఆర్ దృష్టికి ఇక్కడ కార్మికుల జీవన పరిస్థితులు వివరించి వారికి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. శిక్షణ పొందిన మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించి వారు ఆర్థికంగా అభివృ ద్ధి చెందే విధంగా కృషి చేస్తానని చేనేత కార్మికుల కు నా వంతు సహాయ సహాకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రామేశ్వరమ్మ, జడ్పీటీసీలు రాజశేఖర్, పద్మ, వైస్ ఎంపీపీలు సుదర్శన్రెడ్డి, రామకృష ్ణనాయిడు, వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్లు అరుణ, నాగిరెడ్డి, శ్రీమన్నారాయణ, శ్రీనివాసులు, కృష్ణ, గద్వాల టీఆర్ఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవిందు,సాయిశ్యాంరెడ్డి, సమతాసేవా నిర్వాహకురాలు రాధ పాల్గొన్నారు.