జోగులాంబ గద్వాల : ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాలలోని ప్రతి విద్యార్థి చదువు కోవాలన్నదే సీఎం లక్ష్యమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. గద్వాల మండలం చెనుగోని పల్లె గ్రామంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించిన
అదనపు తరగతి గదులను ప్రారంభించి ఎమ్మెల్యే మాట్లాడారు.
గ్రామీణ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన కల్పిస్తున్నారని ఆయన చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు సంవత్సరానికి లక్షా 20వేలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేర్చు చేస్తుందని తెలిపారు.