జోగులాంబ గద్వాల : సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ అన్నారు. గద్వాల మండలం వీరాపురం గ్రామంలో రూ. 40 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గాంధీజీ కలలుగన్న గ్రామ స్వ రాజ్యం కేసీఆర్తోనే సాధ్యమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు నిర్మిస్తుందన్నారు. కాంట్రాక్టర్లు త్వరగా రోడ్డు నిర్మాణ పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్ గౌడ్, సర్పంచ్ స్వప్న వెంకట్రామిరెడ్డి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.