నిష్పక్షపాతంగా దళితబంధు లబ్ధిదారుల ఎంపిక
పెద్దగూడెం రామలింగేశ్వరాలయం మండపానికి నిధులు
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి
పెద్దగూడెం శివారులో హైలెవల్ బ్రిడ్జికి శంకుస్థాపన
వనపర్తి రూరల్, ఫిబ్రవరి 9 : ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో వనపర్తి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. బుధవారం మండలంలోని పెద్దగూడెం గ్రామ శివారులోని చాకలి బొంద వాగుపై నిర్మించ తలపెట్టిన హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ నియోజకవర్గంలో వాగు కాల్వలపై చేపట్టిన బ్రిడ్జి పనులను నాణ్యతగా.. వేగంగా పూర్తి చే యాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ని యోజకవర్గంలో దళితబంధు కింద ఎంపికైన గ్రామా ల్లో లబ్ధిదారులను నిష్పక్షపాతంగా ఎంపిక చేయాలని సూచించారు. గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల తో పల్లెల రూపురేఖలు మారాయన్నారు. సర్కార్ బడు ల్లో మెరుగైన విద్యాబోధన అందించేందుకు రీడ్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. రాబోయే రోజు ల్లో మరింత బలోపేతం చేయడానికి ప్రణాళికలను ప్ర భుత్వం రూపొందిస్తుందన్నారు. అనంతరం టీఆర్ఎస్ నేత కూతురు వివాహానికి మంత్రి హాజరయ్యారు. అ నంతరం పెద్దగూడెం క్రాస్రోడ్డు వద్ద ఉన్న రామలింగేశ్వరాలయంలో మంత్రి పూజలు చేశారు. శివాలయం లో మండపానికి నిధులు మంజూరు చేయిస్తానని హా మీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ కిచ్చారెడ్డి, సర్పంచులు కొండన్న, రవీందర్, ఉపసర్పంచ్ భాస్కర్గౌడ్, ఎంపీటీసీ ధర్మానాయక్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహేశ్వర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మా ణిక్యం, గొర్రెల కాపరుల సంఘం జిల్లా చైర్మన్ కురుమూర్తి యాదవ్, కోళ్ల వెంకటేశ్, చందు, శివస్వాములు, ప్రజలు పాల్గొన్నారు.
మహిళల సమస్యలు పరిష్కరించాలి.
వనపర్తి టౌన్, ఫిబ్రవరి 9 : మహిళలకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు కృషి చే యాలని మంత్రి నిరంజన్రెడ్డి ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని 25వ వార్డులో నిర్మించిన సఖి, వనిత కేంద్ర భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ.48.60 లక్షలతో సఖి కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చామన్నా రు. గృహహింస, ఇతర సమస్యలకు గురయ్యే వారికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. మహిళలపై గృహహింస, వరకట్న, లైంగిక వేధింపులు వంటి వాటిపై కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు వారికి అండగా నిలిచి కొత్త జీవితం ప్రారంభించేందుకు సఖి కేంద్రం సహాయపడుతుందన్నారు. ఇప్పటివరకు 1,042 కేసులు రాగా 385 కేసులు పరిష్కారమయ్యాయని తెలిపారు. అలాగే మర్రికుంటలో నూతనంగా రూ.కోటీ 35 లక్షలతో నిర్మించిన కేజీబీవీ కళాశాల నూతన భవనాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం మహిళా విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి జేఎన్టీయూ ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలల తరగతులు ప్రారంభమవుతాయన్నారు. అనంతరం విద్యార్థులకు ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఉమాదే వి, కలెక్టర్ షేక్యాస్మిన్ బాషా, జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ శ్రీధ ర్, గ్రంథాలయ సంస్థ జిల్లా చై ర్మన్ లక్ష్మయ్య, ఎంపీపీ కిచ్చారెడ్డి, డీడబ్ల్యూవో పుష్పలత, ఆర్అండ్బీ ఈఈ దే శ్యానాయక్, డీఈ శ్రీనివాసులు, డీఈవో రవీందర్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, తాసిల్దార్ రాజేందర్గౌడ్, బాలికల విద్యాభివృద్ధి అధికారిణి సుబ్బలక్ష్మి, ఎంఈవో శ్రీనివాస్గౌడ్, కౌన్సిలర్ జయసుధ, స్పెషల్ ఆఫీసర్ లోహిత పాల్గొన్నారు.