జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆలయాల నిర్మాణానికి భూమిపూజ
జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 7 : ఆలయాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్లలోని హౌసింగ్బోర్డుకాలనీ సీతారామాంజనేయస్వామి ఆలయ ఆవరణలో సోమవారం ఏకాంబరేశ్వర శివాలయం, కామాక్షి అమ్మవారి ఆలయ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అంతకుముందు హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించా రు. అలాగే మండలంలోని ఖానాపూర్లో మల్లప్ప పండుగలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొని డప్పు వాయించి తలర్ కార్యక్రమా న్ని ప్రారంభించారు. అనంతరం బోనాల ఉ త్సవాల్లో పాల్గొన్నారు. కార్యక్రమాల్లో జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, సంగీత,నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, సర్పంచుల సం ఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ప్రణీల్చందర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాట్రపల్లి ల క్ష్మయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ర ఘుపతిరెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు కొంగళి జంగయ్య, టీఆర్ఎస్ నాయకులు నాగిరెడ్డి, ఇంతియాజ్, గిరియాదవ్, రవీందర్, సూరిశెట్టి పవన్, కౌన్సిలర్లు చైతన్యచౌహాన్, జ్యో తి, ప్రశాంత్రెడ్డి, ప్రహ్లాద్ పాల్గొన్నారు.
దైవచింతనతో మానసిక ప్రశాంతత
రాజాపూర్, ఫిబ్రవరి 7 : దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని మల్లేపల్లి సోమ్లానాయక్తండా ఆంజనేయస్వా మి ఆలయంలో నిర్వహించిన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనకు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గొల్లకురుమల ఆధ్వర్యంలో నిర్వహించిన బీరప్ప ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, ఎంపీపీ సుశీ ల, మార్కెట్ కమిటీ చైర్మన్ రఘువీరారెడ్డి, ఎంపీటీసీ అభిమన్యురెడ్డి, టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, రైతుబం ధు సమితి అధ్యక్షుడు నర్సింహులు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు బచ్చిరెడ్డి, నాయకులు నరహరి, మహిపాల్రెడ్డి, యాదగిరి, విజయ్, దేవేందర్, సత్యయ్య, ఆనంద్గౌడ్, వెంకట్రాంరెడ్డి పాల్గొన్నారు.
సంప్రదాయ పండుగలుకొనసాగించాలి
మిడ్జిల్, ఫిబ్రవరి 7 : సంస్కృతి, సంప్రదాయ పండుగలను కొనసాగించాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని కొత్తపల్లిలో వీరనాగమ్మ, బీరప్పస్వా మి కల్యాణోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూ జలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆ ధ్వర్యంలో ఎమ్మెల్యేతోపాటు మండల ప్ర జాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్చైర్మన్ యాద య్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాండు, సర్పంచుల సంఘం మండల అ ధ్యక్షుడు జంగారెడ్డి, నాయకులు శ్రీనివాసులుగుప్తా, బాలు, వెంకట్రెడ్డి, శ్రీనివాసులు, ఆంజనేయులు, కుమార్, రమేశ్, రాజు, సత్తార్, రాఘవేందర్ పాల్గొన్నారు.