జోగులాంబ గద్వాల : గద్వాల మున్సిపాలిటీలో ఎగిరేది గులాబీ జెండాయేనని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు అన్నారు. శనివారం గద్వాల పట్టణం మున్సిపాలిటీలో 37వ వార్డులో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి మంజుల రాణి తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గద్వాలలో గత ప్రభుత్వం చేసిన జరిగిన అభివృద్ధిని చూసి ఓటర్లు ఆలోచించి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా ఏ మాత్రం అభివృద్ధి జరగలేదని అన్నారు.
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమన్నాఉ. అలాగే 32, 33 వార్డులలో మాజీ జెడ్పిటిసి బాసు శ్యామల ఇంటింటి ప్రచారం చేసి తమ అభ్యర్థులు రేణుక, సుజాతలను గెలిపించాలని ప్రజలకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు.