పుట్టినింటి నుంచి ఎడ్లబండిపై రాక
వేలాదిగా తరలొవచ్చిన భక్తులు
గద్వాల రూరల్, ఫిబ్రవరి 9 : నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ బుధవారం జమ్మిచేడులోని మెట్టినింటికి చే రింది. గుర్రంగడ్డ నుంచి భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జములమ్మ పుట్టినిళ్లు గుర్రంగడ్డకు సారెతో మంగళవారం సాయంత్రం చేరుకున్న అమ్మవారు భక్తుల నుంచి ప్రత్యేక పూజలు అందుకున్నారు. అక్కడి నుంచి కృష్ణానదిలో అరిగిలి మీద అమ్మవారిని తీసుకొచ్చారు. నది ఒడ్డు నుంచి ఎడ్లబండిపై అమ్మవారిని తీసుకుని బీరెల్లి, లత్తిపురం, వెంకటోనిపల్లి మీదుగా జమ్మిచేడుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కేరళ నుంచి వచ్చిన కళాకారుల నృత్యాలు, వాయిద్యా లు, ప్రదర్శనలు, పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. భాజాభజంత్రీల మధ్య భక్తులు అమ్మవారి ద ర్శనంతో పునీతులయ్యారు. అమ్మవారిని ఆహ్వానించేందుకు కేరళ నుంచి 100 మంది కళాకారులు ప్రత్యేక డో లు వాయిద్యాలు, బేతాలు, శివసత్తులు, పోతురాజుల వేషధారణ వేశారు. ప్రదర్శనలు చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. జమ్మిచేడులోనే 4 గంటలపాటు కార్యక్రమం నిర్వహించారు. గద్వాల సమీపంలోని జ మ్మిచేడ్ ఆలయానికి చేరుకున్న తర్వాత ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి జములమ్మను దర్శించుకున్నారు. ఎమ్మెల్యేను ఆలయ కమిటీ చైర్మన్ సతీశ్, ఈవో వీరేశం సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని, పాడిపంటలతో రైతులు సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే కాంక్షించారు. ఏర్పాట్లపై ఆలయ కమిటీ చైర్మన్ సతీశ్ కుమార్ను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ నాగిరెడ్డి, తోటరాముడు, బీసన్న, నాగరాజు, సురేష్, రవి, నారాయణ, యేసు, వెంకట్రాములు, శ్రీనివాసులు పాల్గొన్నారు.