ఉమ్మడి జిల్లాలో మొత్తం రైతులు 9,96,325
పెట్టుబడి సాయం రూ.1248.506 కోట్లు
ఏడు విడుతల్లో అందిన సాయం రూ.8587.066 కోట్లు
మహబూబ్నగర్, డిసెంబర్ 27 (నమస్తే తె లంగాణ ప్రతినిధి) : ఆరుగాలం శ్రమించి..కష్టనష్టాలను ఓర్చి..సకల ప్రజానీకం ఆకలి తీరుస్తున్న రైతన్నకు తెలంగాణ సర్కార్ అండగా నిలిచింది. స్వాతంత్య్ర భారతావనిలో రైతులకు ఏ ప్రభుత్వమూ ఒక్క నయాపైసా కూడా పంట పెట్టుబడిగా సాయం అందించలేదు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్నదాతల బంధువయ్యారు. రైతుబంధు పేరిట పంట సాయంగా ఏడాదికి ఎకరాకు రూ. 10వేల చొప్పున అందిస్తున్నారు. కొవిడ్లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ సాయం ఆపలేదు. ఇలా ఇప్పటికే ఉమ్మడి జిల్లా పరిధిలోని సుమారు 10లక్షల మంది రైతులకు ఏడు విడుతల్లో కలుపుకొని రూ.7338.56 కోట్ల రైతుబంధు సాయం అందించారు. ఎనిమిదో విడుత యాసంగి సాయం కింద రూ.1248.506 కోట్లు రైతుల ఖాతాల్లో మంగళవారం నుంచి జమకానున్నాయి.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రైతులకు ఏ ప్రభుత్వమూ న యాపైసా కూడా పంట పెట్టుబడిగా సాయం అం దించలేదు. కానీ, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రైతుబంధు పేరిట ఏడాదికి ఎకరాకు రూ.10వేల చొ ప్పున అందిస్తున్నారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా పరిధిలోని సుమారు 10 లక్షల మంది రైతులకు ఈ యాసంగి సీజన్తో కలుపుకొని రూ.8,58 7.066 కోట్లు పంపిణీ చేశారు. ఇక ఈ ఏడాది యాసంగి సీజన్కు సంబంధించి రైతుబంధు పంట పెట్టుబడి మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ కానున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9,96, 325 రైతులు (24,97,012 ఎకరాలు) లబ్ధి పొం దనున్నారు. రూ.1248.506 కోట్లను ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో వేయనున్నది. గతంలో ఉన్న నిబంధనల మేరకే రైతుల ఖాతాల్లో కేటగిరీల వారీగా డబ్బులు జమకానున్నాయి. మొదట సన్న, చిన్నకారు రైతుల నుంచి ప్రారంభించి.. తర్వాత ఎక్కువ భూమి ఉన్న రైతులకు డబ్బులు వేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో గత వానకాలంలో 9,23,393 మంది రైతుల ఖాతాల్లో రూ.1217.52కోట్లు జమయ్యాయి. ఈసారి కొత్తగా 72,933 మంది రైతులు అర్హత సాధించారు. గత వానకాలంతో పోలిస్తే రూ.30.986 కోట్ల భారం ప్రభుత్వంపై పడనున్నది. దేశంలో తొలిసారిగా రైతులకు నగదు సాయం పథకం ప్రారంభించిన సీఎం కేసీఆర్.. ఆ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు.
2018 వానకాలం సీజన్ నుంచి ప్రారంభం కాగా.. ఏడాదికి రెండు సార్ల చొప్పున ఒక్కో పంటకు రూ.4 వేలు ఇచ్చారు. 2019 వానకాలం నుంచి ఎకరాకు రూ.5 వేల చొప్పున.. ఏడాదికి రూ.10 వేల సాయం అందిస్తున్నారు. ఏటా లబ్ధిదారుల సంఖ్య పెరుగుతున్నా.. వెనక్కి తగ్గకుండా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో గత ఏడు విడతల్లో రూ.7338.56 కోట్లు అందించారు. ఈ యాసంగికి మరో 1248.506 కోట్ల మేరకు రైతుబంధు సాయం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అంటే ఇప్పటివరకు రైతుబంధు సాయంగా ఉమ్మడి మహబూబ్నగర్ పరిధిలోని సుమారు 10 లక్షల మంది రైతులకు రూ.8,587.066 కోట్లు సాయం చేసిన ఘనత ప్రభుత్వానికి దక్కుతుంది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇంతటి సాయం రైతులకు అందలేదు.