తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం
ఖైరతాబాద్, డిసెంబర్ 27 : కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలిచ్చిందో దొంగ దీక్ష చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమాధానం చె ప్పాలని.., ఇక్కడ కాకుండా ఢిల్లీలో దీక్ష చేపట్టాల ని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం సూచించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో పీఎం మోడీ ప్రకటించారన్నారు. ఏడేండ్ల పాలనలో ఇప్పటివరకు 14 కోట్ల ఉద్యోగాలు రావాలని, కనీసం ఎన్ని ఉద్యోగాలిచ్చారో కూడా చెప్పలేని దుస్థితిలో ఉన్నారన్నారు. బండి సంజయ్ కేంద్రాన్ని ప్రశ్నించకుండా ఇక్కడ దీక్షలు చేపట్టడం సిగ్గు చేటన్నారు. బీజేపీ అధికా రం చేపట్టిన తర్వాత ఏ మేరకు రిజర్వేషన్లు అమ లు చేశారో బండి, బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్చుగ్ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలోనే అతి పెద్ద సంస్థ అయిన రైల్వేను, వేల కోట్ల లాభాల్లో ఉన్న ఎల్ఐసీ, బ్యాంకులను ప్రైవేట్పరం ఎందుకు చేశారని ప్రశ్నించారు. రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తుందని కుట్రలు, కుతంత్రాలు చేసి ప్రైవేటీకరిస్తున్నారన్నా రు. బడాబాబుల కోసం ఈ చర్యలకు దిగుతున్నారన్నారు. గత ప్రభుత్వాలు ఇలాంటివి చేసిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేసిందని, దళితబంధు, రైతుబంధు వంటి పథకాలు తీసుకొచ్చి అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నదన్నారు. దివంగ త ప్రధాని వీపీ సింగ్ బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కమిషన్ వేశారని, ఆనాడు బీజేపీ, అనుబంధ సంఘాలు రథయాత్రలు నిర్వహించి ప్రభుత్వాన్ని కూల్చివేశారన్నారు. చివరకు బీసీ జనగణన కూడా చేయడంలేదని, బండి ఎన్ని కుయుక్తులు ప న్నినా తెలంగాణ ప్రజలు నమ్మరని చెప్పారు. చిత్తశుద్ధి ఉంటే బీసీ బిల్లు పెట్టాలని కేంద్రాన్ని కోరాలన్నారు. కేంద్రం హామీ ఇచ్చినట్లుగా ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేస్తూ జనవరి 8న ఇందిరాపార్కు వద్ద దీక్ష చేస్తున్నామన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్వనిర్వాహక అధ్యక్షులు భాస్కర్, నరేందర్, రాష్ట్ర ప్లానింగ్ కమిటీ అధ్యక్షుడు కె.శ్రీనివాస్, టూ వీలర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తోడేటి బాబు, టీఏవైఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.చంద్రమౌళి, దేవయ్య, సుల్తాన్, ఆనంద్ పాల్గొన్నారు.