గౌడ, ఎస్సీ, ఎస్టీలకు మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ల కేటాయింపు
నామమాత్రంగా దుకాణాల పెంపు
గుడుంబాను ఉక్కుపాదంతో అణిచివేస్తాం
గంజాయి పండించినా, రవాణా చేసినా పీడీ యాక్ట్
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్, నవంబర్ 8 : వెనుకబడిన గౌడ, ఎస్సీ, ఎస్టీలు ఆర్థిక పరిపుష్టి సాధించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లను అమలు చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపా రు. మద్యం దుకాణాలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. సోమవా రం మహబూబ్నగర్ కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో, అలాగే గౌడ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి లాటరీ ద్వారా నిర్వహించిన మద్యం దుకాణాల ఎంపికకు మం త్రి హాజరై మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మ ద్యం దుకాణాల్లో గౌడలకు 15 శాతం (363 దుకాణా లు), ఎస్సీలకు 10 శాతం (262 దుకాణాలు), ఎస్టీల కు 5 శాతం రిజర్వేషన్ల ప్రకారం కేటాయింపులు జరిగాయని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దుకాణాల్లో గౌడ, ఎస్టీ, ఎస్సీలకు కలిపి మొత్తం 756 దుకాణాలు కేటాయించినట్లు చెప్పారు. 1,864 షాపులు ఓపెన్ కేటగిరీలో ఉంచినట్లు స్పష్టం చేశారు. గౌడ, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ ద్వారా మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలకు సంబంధించి శాఖల అధికారుల సమక్షంలో లాటరీ ద్వారా మద్యం దుకాణాలు కేటాయించారు.
మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 90 ఉండగా వాటిలో రిజర్వేషన్ ప్రకారం ఎస్టీలకు 3, ఎస్సీలకు 10, గౌడలకు 14 కేటాయించగా.. మిగిలినవి ఓపెన్ కేటగిరీలో ఇవ్వనున్నట్లు చెప్పారు. గతంలో నీరా పథకం తీసుకొచ్చి గౌడలకు అవకాశం కల్పించినట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మద్యం దుకాణాలను ఆయా కమ్యూనిటీలకు లాటరీ ద్వారా కేటాయించినట్లు తెలిపారు. ఈ విడుత షాపుల యాజమానులకు వెసులుబాటు కల్పించామని, ముఖ్యంగా గతంలో రెండు బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వాల్సి ఉండగా, ప్రస్తుతం ఒక్క గ్యారంటీ తీసుకోనున్నట్లు తెలిపారు. దరఖాస్తు ఫీజు, లైసెన్స్ ఫీజు పెంచలేదని, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలతో పోలిస్తే దు కాణాలు కూడా నామమత్రంగా పెంచామన్నారు. గతం లో ఒకరు ఒక్క షాపునకు మత్రమే పాడుకునేందుకు ప రిమితి ఉండేదని, ఇప్పుడు ఆ పరిమితి లేదన్నారు. రా ష్ట్రంలో గుడుంబాను ఉక్కు పాదంతో అణిచి వేస్తామన్నారు. గంజాయిని కూడా అరికడతామని, గంజాయి పండించినా.., రవాణా చేసినా వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. కల్తీ మద్యాన్ని 100 శాతం నియంత్రిస్తామని, గతంలో యాదవులకు గొర్రె లు, ముదిరాజ్లకు చేపలు ఉచితంగా పంపిణీ చేశామన్నారు. ప్రతి కులం వారు ఆత్మగౌరవంతో బతికేలా చూ డడమే తమ లక్ష్యమన్నారు. దేశంలో ఎక్కడా లేని వి ధంగా వెయ్యి గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు. స మావేశంలో కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ సీతారామారావు, ఎక్సైజ్ డిప్యుటీ కమిషనర్ ఖురేషీ, సీఐ రా మకృష్ణ, బీసీ సంక్షేమాధికారి ఇందిర, డీటీడీవో ఛత్రు, ఎస్సీ సంక్షేమ అధికారి యాదయ్య తదితరులున్నారు.