టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాస్ రెడ్డి
వెల్దండ, ఫిబ్రవరి 13 : దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే అజెండాలుగా ఎన్నికల హామీలుగా అన్ని పార్టీలు ప్రకటిస్తున్నాయని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆదివారం వెల్దండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికలు జరిగే ఐదురాష్ర్టాల మేనిఫెస్టోలోనూ తెలంగాణ పథకాలు పెట్టారని, ఉత్తరప్రదేశ్లో ఉచిత విద్యుత్, రైతు బీమా, పంజాబ్లో రుణమాఫీ, ఉచిత కరెంట్, గుజరాత్లో పారిశ్రామిక పాలసీ పథకాలు ఎన్నికల హామీలో ఉన్నాయన్నారు. దేశంలో తెలంగాణ పథకాలు పలు పార్టీలకు ఆదర్శమవుతూ ప్రజా సంక్షేమానికి దారి చూపిస్తున్నాయన్నారు. కేంద్రం కూడా కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతు బంధు, జలజీవన్ మిషన్ పేరుతో మిషన్ భగీరథ పథకాలను కాపీ కొట్టి అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే తెలంగాణ సర్కార్ సంక్షేమ సర్కార్గా పేరు గాంచిందని కితాబు ఇచ్చారు. పన్నులు పెంచకుండానే సమర్థ వంతంగా కరోనా విపత్కర పరిస్థితులను దీటుగా ఎదుర్కొని ఒడిదుడుకులు లేకుండా సీఎం కేసీఆర్ ముందుచూపుతో వ్యవహరించారన్నారు. కార్యక్రమంలో వెల్దండ సింగిల్ విండో డైరెక్టర్ నాగులు నాయక్, ఆమనగల్ వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి, మార్కెట్ డైరెక్టర్ సుభాశ్, తలకొండపల్లి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్రెడ్డి, ఆమనగల్ రైతు సంఘం అధ్యక్షుడు రూపం వెంకట్రెడ్డి, అహ్మద్, ప్రసాద్, వడ్డెమోని శివ, సాయినాథ్ రెడ్డి, రవి పాల్గొన్నారు.