మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఫిబ్రవరి 23 : వైద్యవృత్తి చాలా పవిత్రమైనదని, ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అం దిస్తేనే గుర్తింపు వస్తుందని మహబూబ్నగర్ మెడికల్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ పుట్టా శ్రీనివాస్ తెలిపారు. మహబూబ్నగర్ మెడికల్ కళాశాలలో నూతనంగా చేరిన ఆరో బ్యాచ్ వైద్య విద్యార్థులకు బుధవారం కాలేజీ సెమినార్ హాల్లో ప్రభుత్వ జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ రమేశ్, ఇతర విభాగాధిపతులతో కలిసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పుట్టా శ్రీనివాస్ మాట్లాడుతూ వి ద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉత్తమ డాక్టర్లుగా ఎదగాలన్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని ఎన్నటికీ మరవొద్దన్నారు. తెలంగాణలో గాంధీ, ఉస్మాని యా తరువాత మహబూబ్నగర్ వైద్య కళాశాలకు అంతటి గుర్తింపు ఉందన్నారు. ఉత్త మ ప్రమాణాలు, టీచింగ్ ప్యాకల్టీ, ఆహాద్లకరమైన క్యాంపస్, అన్ని రకాల వసతులు ఉన్నాయన్నారు. కళాశాలలో మొత్తం 175 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని, ఆలిండియా కోటా లో కొందరికి సీట్లు వచ్చాయన్నారు. బీహార్, రాజస్థాన్, గుజరాత్ నుంచి కూడా ఇక్కడకు వచ్చి చదువుకుంటున్నట్లు చెప్పారు. సూపరింటెండెంట్ రమేశ్ మాట్లాడుతూ కష్టపడి చదివి ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం వైద్య విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఆర్థోపెడిక్ విభాగాధిపతి డా.రాంకిషన్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సునందిని, విభాగాధిపతులు డా.నవకల్యాణి, డా.రమాదేవి, డా.గీతా మీనాక్షి, ఎన్ఎంసీ నోడల్ అధికారి డా.కిరణ్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.