మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
బడ్జెట్ సమావేశంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి
భూత్పూర్, ఫిబ్రవరి 23 : కొత్తగా ఏర్పడిన భూత్పూర్ మున్సిపాలిటీని అన్నిరంగాల్లో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. స్థానిక కేవీఎన్ ఫంక్షన్హాల్లో బుధవారం మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన మున్సిపల్ బడ్జెట్ సమావేశానికి ఎమ్మెల్యే ఆల, కలెక్టర్ వెంకట్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలో పన్నుల రాబ డి, పన్నులేతర రాబడిని చైర్మన్ వివరించారు. గతేడాది రూ.2కోట్ల 70లక్షల రాబడి ఉండగా, ఈ ఏడాది రూ.10కో ట్ల 75లక్షలకు పెంచినట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ భూత్పూర్ మున్సిపాలిటీని అన్నివిధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. అన్ని వార్డుల అభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. భూత్పూర్ చౌరస్తాను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. మహబూబ్నగ ర్, భూత్పూర్, జడ్చర్ల మున్సిపాలిటీలను కలుపుతూ పట్టణాభివృద్ధి సంస్థగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో తక్కువ సమయంలో భూత్పూర్ మున్సిపాలిటీ మరింత అ భివృద్ధి చెందుతుందన్నారు. మున్సిపాలిటీలోని ప్రతి తండా కూ బీటీరోడ్డు నిర్మించేందుకు రూ.12కోట్ల 50లక్షలు త్వరలోనే మంజూరు కానున్నాయని తెలిపారు.
డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణంపై సమీక్ష
మున్సిపల్ బడ్జెట్ సమావేశం అనంతరం డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవరకద్ర నియోజకవర్గంలో 1190ఇండ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. ఇండ్ల మంజూరుకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు వివరించారు. అనంతరం ఎమ్మె ల్యే మాట్లాడుతూ నియోజకవర్గానికి మంజూరైన ఇండ్ల పనులను త్వరితగతిన పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మరో 1500 ఇండ్లు మంజూరు చేస్తానని తెలిపారు. భూత్పూర్కు 288ఇండ్లు, మద్దిగట్లకు 80, కొత్తూర్కు 40, మూసాపేటకు 80, పోల్కంపల్లికి 80 ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ ప వార్, వైస్చైర్మన్ కెంద్యాల శ్రీనివాస్, తాసిల్దార్ చెన్నకిష్టన్న, కమిషనర్ నూరుల్నజీబ్, కౌన్సిలర్లు శ్రీనివాస్రెడ్డి, బాలకోటి, కృష్ణవేణి, గడ్డం నాగమ్మ, సూర్యకళ, మున్సిపల్ మేనేజర్ అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.