లగ్గం ఖర్చులకు తొలగిన కష్టాలు
వనపర్తిలో మంత్రి నిరంజన్రెడ్డి సహపంక్తి భోజనం
లబ్ధిదారుల్లో వెల్లివిరుస్తున్న ఆనందం
వనపర్తి, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం లబ్ధిదారుల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది. ఆడపిల్ల.. తల్లిదండ్రుల గుండెల మీద కుంపటిలా మారకూడదనే ఉ ద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆడపిల్లల పెండిండ్లకు 1,00,116 అందజేస్తూ అం డగా నిలుస్తున్నారు. వనపర్తి నియోజకవర్గంలో లబ్ధిదారుల సం ఖ్య 10 వేలకు చేరువలో ఉన్నది. దీంతో అర్హత ఉన్న పేదిం టి బిడ్డ లగ్గానికి ఇబ్బందులు తొలగాయి. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రత్యేక సంప్రదాయానికి తెరతీశారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అందజేయడంతోపాటు విందు ఏర్పాటు చేసి కడుపునిండా భోజనం పెడుతున్నాడు. చెక్కులు అందుకున్న వారితో సహపంక్తి భోజనం చేస్తున్నారు. తను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఇదే పద్ధతి పాటిస్తున్నారు. ఇందుకోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఒక్కోసారి మండల కేంద్రాల్లో కూడా సహపంక్తి భోజనాలు చేస్తున్నారు. కలెక్టర్, ఉన్నతాధికారులు కూడా పాలుపంచుకుంటున్నారు. వనపర్తి నియోజకవర్గంలో ఇప్పటివరకు 9,665 మంది లబ్ధి పొందారు. మరికొన్ని దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. ఖిల్లాఘణపురం మండలంలో 1,183 మంది కల్యాణలక్ష్మి, 46 మంది షాదీముబారక్ చెక్కులు అందుకున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులు వరుసగా గోపాల్పేటలో 1,209, 24, పెబ్బేరులో 1,552, 100, పెద్దమందడిలో 1,184, 44, రేవల్లిలో 657, 31, శ్రీరంగాపూర్లో 507, 47, వనపర్తిలో 2,684, 397 మంది లబ్ధిదారులు ఉన్నారు. నియోజకవర్గం మొత్తంగా 8,976 మందికి కల్యాణలక్ష్మి, 689 మందికి షాదీముబారక్ చెక్కులు అందాయి.