జిల్లా ఏర్పాటుతో అభివృద్ధి పరుగులు
సీఎం కేసీఆర్ను విమర్శిస్తే బాగుపడరు
ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
పేటలో ఆర్టీవో కార్యాలయం ప్రారంభం
నారాయణపేట, సెప్టెంబర్ 17: నారాయణపేట జిల్లాకు ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తామని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. శుక్రవారం పేటలో ఆర్టీవో కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాల ఏర్పాటుతో అభివృద్ధి పరుగులు పెడుతున్నదన్నారు. సీఎం కేసీఆర్ను విమర్శిస్తున్న ప్రతిపక్షాలు బాగుపడవన్నారు.
ప్రపంచపటంలో నారాయణపేటకు గుర్తింపు తీసుకొస్త్తామని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన రవాణాశాఖ కార్యాలయాన్ని శుక్రవారం ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో చేస్తున్న అభివృద్ధిని చూసి పేట సరిహద్దున ఉన్న కర్ణాటకలోని పలు గ్రామాల ప్రజలు తెలంగాణలో కలుస్తామంటున్నారన్నారు. పేట జిల్లాగా ఏర్పాటయ్యాక వేగంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. గోల్డ్, చేనేత మార్కెట్లు ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్కు ఉందని, అందుకోసం ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, రామ్మోహన్రెడ్డి పట్టువదలకుండా పనిచేస్తున్నారని మంత్రి అభినందించారు. దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదగడం గర్వకారణమన్నారు. ప్రతిపక్షాలు దళితులను ఓటుబ్యాంకు కోసం వాడుకున్నాయని, ప్రస్తుతం సీఎం కేసీఆర్ దళితుల ఆర్థిక అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలను అన్నివిధాలా ఆదుకుంటున్న సీఎం కేసీఆర్ను తిడితే బాగుపడరన్నారు. అతిత్వరలో అన్ని హంగులతో ఆర్టీవో కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. సెట్విన్ లాంటి ట్రేనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేటను జిల్లాచేసి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని తెలిపారు. ఆర్టీవో కార్యాలయానికి త్వరలోనే సొంత భవనం ఏర్పాటు చేస్తామన్నారు.
పేటకు టీఎస్38 రావడం వల్ల ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. ఎమ్మెల్యే చిట్టెం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహకారంతో జిల్లా అన్నివిధాలా అభివృద్ధి చెందుతున్నదన్నారు. ప్రతిపక్షాల మాటలు పట్టించుకోకుండా అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. అనంతరం కోయిల్కొండ మండలం చంద్రాసుపల్లికి చెందిన శోభావెంకట్రెడ్డికి సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.5లక్షల ఎల్వోసీని మంత్రి శ్రీనివాస్గౌడ్ అందజేశారు. అదేవిధంగా పట్టణంలోని 8వ వార్డు జెడ్పీ కార్యాలయం ఆవరణలో కొవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమాల్లో జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్, కలెక్టర్ హరిచందన, ఎస్పీ చేతన, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రామకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, వైస్చైర్మన్ హరినారాయణ భట్టడ్, ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, జెడ్పీటీసీ అంజలి, డీటీసీ దుర్గాప్రమీల, డీఎంహెచ్వో రాంమనోహర్రావు, మహబూబ్నగర్ ఎంవీఐ శ్రీనివాస్రెడ్డి, గద్వాల ఆర్టీవో పురుషోత్తంరెడ్డి, ఉప్పల్ ఆర్టీవో రవీందర్, ఎంవీఐలు నవీన్, అమర్నాథ్, భీంసింగ్, నర్సింహస్వామి, మున్సిపల్ కమిషనర్ భాస్కర్రెడ్డి, కౌన్సిలర్ శిరీష తదితరులు పాల్గొన్నారు.
వ్యాక్సిన్తోనే కరోనా కట్టడి
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, సెప్టెంబర్ 17: వ్యాక్సిన్తోనే కరోనా కట్టడి సాధ్యమవుతుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్నగర్లోని వెంకటేశ్వర కాలనీలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఎక్కడా వ్యాక్సిన్ కొరత ఏర్పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
రహదారులను సుందరంగా తీర్చిదిద్దాలి
రహదారులకు ఇరువైపులా మొక్కలునాటి సుందరంగా తీర్చిదిద్దాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. జిల్లాకేంద్రంలోని అప్పన్నపల్లి సమీపంలో జడ్చర్ల-మహబూబ్నగర్ నాలుగులేన్ల రహదారిపై పెద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రధాన రహదారులకు ఇరువైపులా పెద్దఎత్తున మొక్కలు నాటేందుకు కడియం నుంచి తెప్పించినట్లు తెలిపారు. కార్యక్రమాల్లో కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్చైర్మన్ గణేశ్, డీసీసీబీ ఉపాధ్యక్షుడు వెంకటయ్య, డీఎంహెచ్వో కృష్ణ, అడినషల్ డీఎంహెచ్వో శశికాంత్, డీఐవో శంకర్, తిరుపతిరావు, కౌన్సిలర్ రోజా, కమిషనర్ ప్రదీప్కుమార్ పాల్గొన్నారు.
నాగరాజు కుటుంబానికి అండగా ఉంటాం
మహబూబ్నగర్, సెప్టెంబర్17: గణేశ్ నిమజ్జనోత్సవం లో ప్రమాదవశాత్తు మృతిచెందిన ఎదిర నాగరాజు కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. నాగరాజు కుటుంబసభ్యులకు రూ.25వేల చెక్కు అందజేశారు. డబుల్బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. అదేవిధంగా మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఆంజనేయస్వామి విగ్రహ ఏర్పాటుకు మంత్రి శ్రీనివాస్గౌడ్ స్థలాన్ని పరిశీలించారు. మంత్రివెంట కలెక్టర్, మున్సిపల్ చైర్మన్, నాయకులు పాల్గొన్నారు.
విశ్వకర్మ జయంతి వేడుకల్లో మంత్రి, ఎంపీ
మహబూబ్నగర్, సెప్టెంబర్ 17 : జిల్లాకేంద్రంలోని మోనప్పగుట్ట మౌనేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం విరాట్ విశ్వకర్మ మహాయజ్ఞం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ భగవాన్ కలశ ఊరేగింపును రాంమందిర్చౌరస్తా నుంచి తూ ర్పుకమాన్ మీదుగా మౌనేశ్వరస్వామి ఆలయంవరకు కనులపండువగా నిర్వహించారు. వేడుకలకు మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి హాజరై యజ్ఞం చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్, గణేశ్గుప్తా, శ్యాంసుందర్రావు, సుబ్బయ్యశెట్టి, ప్రభులింగం, కుమారస్వామి, దశరథగుప్తా, వెంకటరమణ, బాలకిష్టయ్య, బుచ్చయ్య, విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.