Delhi : దేశ రాజధాని ఢిల్లీలో గుర్తుతెలియని వ్యక్తి వదిలేసి వెళ్లిన బ్యాగు కలకలం రేపింది. కన్నాట్ప్లేస్ ఏరియాలోని N బ్లాకులో ఎవరో వదిలేసి వెళ్లన బ్యాగు కనిపించడంతో అందులో బాంబు ఉందేమోనన్న అనుమానంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. అక్కడి జనాన్ని అప్రమత్తం చేశారు.
బ్యాగు ఉన్న ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాంబు స్క్వాడ్ను పిలిపించి తనిఖీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
#WATCH | Delhi: An unattended bag found at N Block of Connaught Place N Block. Area has been cordoned off. Police team present at the spot. Details awaited. https://t.co/VcgCj1zXip pic.twitter.com/mbjiPnIAOj
— ANI (@ANI) May 4, 2024