పాత నేరస్తులు, కొత్త వ్యక్తులపై నిఘా ఉంచాలి
ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలి
శాంతి భద్రతల సమావేశంలో ఎస్పీ వెంకటేశ్వర్లు
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఫిబ్రవరి 11 : పోలీస్ సి బ్బంది చేస్తున్న కృషి వల్ల జిల్లాలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని, ప్రస్తుత పరిస్థితులను బ ట్టి సమాజంలో ఉన్న సమస్యలను గుర్తిస్తూ, ప్రా థమిక దశలోనే చట్ట వ్యతిరేక కార్యకలాపాల ని యంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని, చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు అన్నారు. జి ల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులతో శుక్రవారం శాంతిభద్రతల సమావేశం నిర్వహించా రు. పోలీస్ స్టేషన్ల వారీగా నేరాల వివరాలు, ద ర్యాప్తు నిర్వహిస్తున్న తీరును ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బందికి పలు సూచనలు చేస్తూ నిందితులకు న్యాయస్థానంలో శిక్ష పడేందుకు, దర్యాప్త్తులో ఎప్పటికప్పుడూ పదును పెం చుకోవాలని పేర్కొన్నారు. దీర్ఘకాలికం గా పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తు ను పూర్తి చేయడంలో మరింత శ్రద్ధ చూపాలన్నారు.
స్టేషన్ పరిధిలో జరిగే నేరాలపై సం బంధిత అధికారి, సిబ్బందికి సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని ఆలయ చెప్పారు. జైలు నుంచి విడుదల అవుతున్న నేరస్తులు, కొత్త వ్యక్తులు, అనుమానితులపై నిరంతరం నిఘా ఉంచా లన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణ కు స్టేషన్ స్థాయిలో ఎవరికీ వారు ప్రత్యేక ప్రణాళిక ఏర్పర్చుకోవడం, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టడంతోపాటు, వాహనాల తనిఖీలు నిర్వహించాన్నారు. నిషేధిత మత్తు పదార్థల వల్ల జరిగే అనర్థాలపై ప్రజలకు, వి ద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఇటువంటి వ్యవహారాలు చట్టప్రకారం నేరమని హెచ్చరించాలన్నారు. రా ష్ట్రస్థాయిలో ఉత్తమంగా నిలిచిన స్టేషన్ల అధికారులు, పనితీరులో చక్కని ప్రతిభ కనబర్చిన సిబ్బందిని ఎస్పీ పేరుపేరునా అభినందించారు. మన స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలన్నారు. నేరాల నివారణకు ప్రజలకు పోలీస్ సాయం అవసరమైనప్పుడు డయల్ 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలనే విషయంపై ప్రచారం చేయాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ రామ్కుమార్, డీఎస్పీ కిషన్, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు తదితరు లు పాల్గ్గొన్నారు.