బాలానగర్, ఫిబ్రవరి 12: టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎన్నిక కావడంపై మండలంలోని ఉడిత్యాల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే స్వగృహంలో లక్ష్మారెడ్డికి ఉడిత్యాల గ్రామస్తులు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ మల్లేశ్, టీఆర్ఎస్ యూత్వింగ్ మండల అధ్యక్షుడు సుప్ప ప్రకాశ్, ఉడిత్యాల రైతుబంధు సమి తి గ్రామ అధ్యక్షుడు నర్సింగ్రావు, గ్రామస్తులు యాదయ్య, మల్లేశ్ తదితరులు ఉన్నారు.లక్ష్మారెడ్డి సారథ్యంలో పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
భూమిపూజకు ఆహ్వానం
రాజాపూర్, ఫిబ్రవరి 12: మండలంలోని చెన్నవెల్లి గ్రామంలో వెలిసిన సీతారామచంద్రస్వామి ఆలయ కల్యాణ మండప నిర్మాణం కోసం ఈ నెల 19న నిర్వహించే భూమిపూజ కార్యక్రమానికి హాజరుకావాలని అలయకమిటీ సభ్యులు శనివారం హైదరాబాద్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని కలిసి అహ్వానించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాధావెంకట్రాంరెడ్డి, ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు జంగయ్య, శేఖర్రెడ్డి, రాజయ్య, నర్సింహులు, రాములు తదితరులు పాల్గొన్నారు.