మన్యంకొండ క్షేత్రానికి ఉత్సవ శోభ
8రోజుల పాటు వెంకన్న ఉత్సవాలు
విద్యుద్దీపాల కాంతుల్లో ఆలయం
శోభాయమానంగా పల్లకీసేవ
వందలాదిగా తరలివస్తున్న భక్తులు
మహబూబ్నగర్, ఫిబ్రవరి 11: జిల్లా కేంద్రానికి సమీపంలోని తెలంగాణ తిరుపతి మన్యకొండ బ్రహ్మోత్సవాలు కనులపండువగా ఆరంభమయ్యాయి. తెల్లవారుజామున నుంచి భక్తులు రాక మొదలైంది. ఉత్సవాలకు అధికారులు ముందస్తుగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఈనెల 18వరకు నిర్వహించనున్న మన్యంకొండ లక్ష్మీవెంకటేశ్వర స్వామి, 16నుంచి 20వరకు నిర్వహించే అలివేలు మంగమ్మ బ్రహ్మోత్సవాలకు ఆలయాలను విద్యుద్దీపాల వెలుగులో ముస్తాబుచేశారు. ఇదిలా ఉండగా శుక్రవారం కోటకదిర నుంచి మన్యంకొండ వరకు స్వామివారికి పల్లకీ సేవ నిర్వహించారు. రాత్రి స్వామి వారికి తిరుచ్చి సేవా పూజ కార్యక్రమాలను నిర్వహించారు. వేడుకల్లో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.