గద్వాల, సెప్టెంబర్ 20 : సీఎం కేసీఆర్, మం త్రులు కేటీఆర్, హరీశ్రావుల సహాయ సహకారాలతో గద్వాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని నల్లకుంటలో నూతనంగా నిర్మిస్తున్న ఆడిటోరియం ప నులను మున్సిపల్ చైర్మన్ కేశవ్ కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా గద్వాల ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని, గద్వాల పాలించిన నాయకులు అభివృద్ధి చెందారే త ప్పా ప్రజల అభివృద్ధిని గాలికొదిలేశారని ఆరోపించారు.
బీఆర్ఎస్ హయాంలో జిల్లా కేంద్రంలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని, ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలు అందించి ఆదుకుంటున్నట్లు గుర్తు చేశారు. జిల్లా కేంద్రంలో ఆడిటోరియం లేకపోవడం వల్ల ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అవకాశం లేకుండా పోయిందన్నారు. ప్రస్తుతం ఆడిటోరియం పనులు వేగవంతంగా జ రుగుతున్నాయని చెప్పారు. అన్ని వసతులతో ఆడిటోరియం నిర్మాణం చేపడుతున్నామని, అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
జిల్లా కేంద్రంలో పలు వార్డుల్లో వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించగా ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి బుధవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. రాజవీధిలో ఆర్యవైశ్యసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడితోపాటు పాండురంగ స్వామి ఆలయం లో స్వకులశాలి సంఘం ఆధ్వర్యంలో చంద్రయాన్-3 రూపంలో ఉన్న విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ కేశవ్, ఎంపీపీ విజయ్కుమార్, కౌన్సిలర్లు నాగిరెడ్డి, మురళి, శ్రీనివాసులు, నరహరిగౌడ్, బీఆర్ఎస్ నాయకులు సురేశ్శెట్టి, శ్రీకాంత్, రాము తదితరులు పాల్గొన్నారు.