గద్వాల, ఫిబ్రవరి 3 : కృష్ణా జలాల కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని గద్వాల ఎమ్మెల్యే బం డ్ల కృష్ణమోహన్రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులను కృష్ణాబోర్డు పరిధిలోకి కాంగ్రెస్ ప్రభు త్వం అప్పగించడాన్ని నిరసిస్తూ శనివారం ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుపై రైతులతో కలిసి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా బండ్ల మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేసి సాధించినట్లు గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తిరిగి కేంద్రం చేతుల్లో ప్రాజెక్టులను పెట్టిందని ధ్వజమెత్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వాసి రేవంత్రెడ్డి తన స్వార్థం కోసం ఇక్కడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంతో పొలాలన్నీ ఎడారిగా మారే అవకాశం ఉన్నదని వాపోయారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే మనుగడ సాధించడం కష్టమన్నారు.
సాగునీటి నిర్వహణ చేతగాక రాష్ట్ర ప్రభు త్వం ఈ నిర్ణయం తీసుకున్నదని దుయ్యబట్టారు. వీరి అసమర్థతను ప్రజల్లో ఎండగడుతామని హెచ్చరించారు. గురువారం కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో తెలంగాణ ప్రాజెక్టుల కింద ఉన్న అ వుట్లెట్స్ని ఈఎన్సీ బోర్డుకు అప్పగించారనేది వా స్తవం కాదా? అని ప్రశ్నించారు. బోర్డు సమావేశ మినిట్స్ను పరిశీలిస్తే అసలు విషయం బయట ప డుతుందని చెప్పారు.
ఇక్కడి ప్రాజెక్టులకు కృష్ణా రివర్స్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించలేదని బోర్డు తో చెప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాజె క్టు అంటే నీళ్లు ఒక్కటే కాదని ఆయకట్టు సాగు, కా ల్వలు, తాగునీటిని అందించే కాల్వలు, ఇతరత్రా బోర్డుకు అప్పగిస్తే తెలంగాణకు అనుకున్న స్థాయి లో నీరు ఎక్కడి నుంచి వస్తుందని నిలదీశారు. గ తంలో ఏ అధికారి లేనప్పుడే కృష్ణానీళ్లు మనకు అం దలేదని, శ్రీశైలం నుంచి రాయలసీమకు వందలా ది టీఎంసీలు సీమ నేతలు అక్రమంగా తరలించుకుపోతున్నా కృష్ణాబోర్డు ఏనాడూ అడ్డుకోలేదని గు ర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ నా యకత్వంలో ప్రభుత్వం పదేళ్లుగా ప్రాజెక్టులను బో ర్డుకు అప్పగించకుండా అడ్డుకున్నదని తెలిపారు. కృష్ణా జలాల్లో జవహర్ నెట్టెంపాడుకు 21 టీఎంసీ లు, రాజీవ్ భీమాకు 20 టీఎంసీలు, కోయిల్సాగర్కు 3.9 టీఎంసీల నికర జలాల కేటాయింపు ఉం దని తెలిపారు.
కృష్ణా జలాలను బోర్డుకు అప్పగిస్తే జోగుళాంబ గద్వాల జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతోపాటు కర్ణాటక, మహారాష్ట్రతోపాటు తెలంగాణలోని దిగువన ఉన్న ప్రియదర్శిని జూరాల, నెట్టెంపాడ్ ప్రాజెక్టులు నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయనన్నారు.
వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయా న్ని వెనుక్కు తీసుకోవాలని సూచించారు. లేకుంటే ప్రజలు, రైతులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రాజశేఖర్, వైస్ ఎంపీపీ సుదర్శన్, నాయకులు రఘురెడ్డి, జంబురామన్గౌడ్, ప్రభాకర్గౌడ్, కురుమన్న, చంద్రాములు, ఈశ్వర్, వంశీ తదితరులు పాల్గొన్నారు.