నాగర్కర్నూల్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకొన్నారు. కాగా ఎమ్మెల్యేలు, కలెక్టర్లతోపాటుగా వృద్ధులు సైతం ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకొన్నారు. ఇక రాత్రి వరకు జరిగిన పోలింగ్తో బాగా పొద్దుపోయాక ఈవీఎంలు జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు లెక్కింపు కేంద్రానికి తీసుకువచ్చారు.
నాగర్కర్నూల్ జిల్లాలో పోలింగ్ శాంతియుతంగా జరిగింది. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో చేసిన ఏర్పాట్లతో గ్రామాలు, పట్టణాలతోపాటుగా చెంచు పెంటల్లోనూ ఓటు హక్కు వినియోగించుకొన్నారు. జిల్లాలోని నాగర్కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, అసెంబ్లీ స్థానాలకు గురువారం ఎన్నికలు జరిగాయి. నాగర్కర్నూల్ స్థానంలో 15మంది, కొల్లాపూర్, అచ్చంపేటలో 14మంది చొప్పున, కల్వకుర్తిలో 24మంది పోటీలో ఉన్నారు. పోలింగ్లో భాగంగా ఉదయం 5:30గంటల నుంచి మాక్ పోలింగ్ నిర్వహించి 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభించారు. బీఎల్వోల ద్వారా ఇప్పటికే ఓటర్లకు పోలింగ్ చీటిలు అందజేయగా ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్దకు చేరుకొన్నారు. గతం కంటే పోటీ ఎక్కువగా ఉండటంతో బీఆర్ఎస్, ఇతర పార్టీల శ్రేణులు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చేలా చూశారు. జిల్లాలో 1,064పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నాగర్కర్నూల్లో 194, అచ్చంపేటలో 199పోలింగ్ కేంద్రాలు, కొల్లాపూర్లో 202, కల్వకుర్తిలో 261పోలింగ్ కేంద్రాలు, అచ్చంపేట ఏజెన్సీలో ప్రత్యేకంగా 9పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఇక ఎన్నికల్లో ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి సొంతూరు నేరెళ్లపల్లిలో ప్రాథమికోన్నత పాఠశాలలో, బీరం హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్ బాలికల జెడ్పీ హైస్కూల్లో, అచ్చంపేట ప్రాథమిక పాఠశాలలో గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్ చల్లంపల్లిలో, మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి జిల్లా కేంద్రంలోని సంజయ్నగర్ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకోగా కలెక్టర్ ఉదయ్ కుమార్ జిల్లా కేంద్రంలోని సంఘమిత్ర పాఠశాలలో క్యూలో నిల్చొని ఓటు వేశారు. నల్లమలలోని అటవీ చెంచు పెంట ల్లో 9పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 75 శాతంతో 290 మంది ఓటు హక్కు వినియోగించుకొన్నారు. ఇక ఆయా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎన్నికల పర్యవేక్షణ చేపట్టారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీల నాయకులు పోలింగ్ కేంద్రాల వద్ద తెల్లవారుఝాము నుంచి పోలింగ్ ముగిసే వరకూ వేచి ఉన్నారు.
స్వల్ప వివాదాలు, చెదురు ముదు రు ఘర్షణలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో ఎన్నికల అధికారులతో పాటుగా పోలీసులు ఊపిరి పీల్చుకొన్నారు. కాగా చాలా మంది సాయంత్రం 5గంటల వర కు క్యూలైన్లలో ఓటు వేసేందుకు ఉండటంతో రాత్రి వరకూ పోలింగ్ జరిగింది. చివరగా ఈవీఎం బాక్సులను జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులోని లెక్కింపు కేంద్రానికి అర్ధరాత్రి సమ యం వరకూ తీసుకొచ్చారు. పోలింగ్ సిబ్బందితోపాటుగా పోలీసులు ప్రత్యే క వాహనాల్లో చేరుకొన్నారు. మొ త్తం మీద అభ్యర్థుల భవితను ఓటర్లు ఈవీఎంలలో నిక్షి ప్తం చేశారు. ఈనెల 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నా రు. ఫలితంగా ఉత్కంఠగా ఎదురు చూ సిన ప్రజలు, నా యకులు, అభ్యర్థు లు ఓటింగ్ సరళిపై అంచనాలు వేసుకొంటున్నారు. ఏయే గ్రామాల్లో ఏయే కారణాలతో ఓటిం గ్ ప్రభావం చూపిందోనని గ్రామాల వారీ గా సమీక్షిస్తూ ఫలితాల ముందే ఓ అంచనాకు రానున్నారు. ఇక కౌం టింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లు సైతం చేపట్టారు.