మహబూబ్నగర్, మార్చి 4 : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉచి త విద్యుత్ పథకానికి బ్రేక్ పడింది. ఇందుకు ఎన్నికల కోడ్ కంటే ముం దుగా ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టకపోవడంతో సీఎం సొంత జిల్లాలో ఉచిత విద్యుత్ అమలు కోడ్ ముగిసే వరకు ఆగనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 200యూనిట్ల ఉచిత విద్యుత్ను అందిస్తామని కాంగ్రెస్ ప్రభు త్వం చెప్పిన విషయం విధితమే.
స్థానిక సంస్థల శాసన మండలి ఉపఎన్నికల కోడ్ రావడంతో మార్చిలో వినియోగదారులు బిల్లులు చెల్లించాల్సిందే. ఉచిత విద్యుత్ ఈ నెలలో వస్తుందని అనుకున్న విద్యుత్ వినియోగదారులకు చేదు అనుభవం మిగలనున్నది. ఎన్నికల కోడ్ ఏప్రిల్ 4వ తేదీన ముగియనున్నది. అయితే ఈ కోడ్ అమలులో ఉండగానే పార్లమెంట్ ఎన్నికల కోడ్ కూడా వస్తుందని, ఇక ఈ పథకం అమలు కావాలంటే జూన్ వరకు ఆగాల్సిందేనని పలువురు చర్చికుంటున్నారు.
ముందుగానే కాంగ్రెస్ సర్కారు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసి ఉంటే ఉ మ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెలలోనే ఉచిత విద్యుత్ అమలై ఉండేదని వినియోగదారులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఉచిత విద్యుత్ అమలుకు కోడ్ ముగిసే వరకు వినియోగదారులు వేచి చూడాల్సిందే.
ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఉచిత విద్యుత్ను అమలు చేస్తాం. ప్ర స్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉచిత విద్యుత్ పథకం అమలు కాదు. అయితే విద్యుత్ వినియోగదారుల ఇప్పుడు చెల్లించిన డబ్బులకు సరిపో నూ ఉచిత విద్యుత్ను కోడ్ ముగిసిన తరువాత అందిస్తాం. ఈ విషయం లో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
– వెంకటరమేశ్, విద్యుత్ శాఖ ఎస్ఈ, మహబూబ్నగర్ జిల్లా