నారాయణపేట టౌన్, నవంబర్ 26 : సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని, అందుకే వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. తెలంగాణలో రైతులకు ఉచిత విద్యుత్ను స రఫరా చేస్తుంటే.. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టడం ప్రారంభమైందన్నా రు. శనివారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని శీలా గార్డెన్స్లో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ వనజ మ్మ, ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రె డ్డి, కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గ తంలో జెడ్పీ సమావేశాలు జరిగితే ప్రతిపక్ష సభ్యులు ఖాళీ బిందెలు తీసుకొచ్చి పోడియం ముందు కూర్చొని సమస్యను పరిష్కరించాలని ఆందోళన చేసేటోళ్లని గుర్తు చేశారు. కరెంట్ సరఫరా సరిగ్గా లేదని, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయని రైతులు ఆందోళన చేసేవారన్నారు. అ దంతా గతమని.. తెలంగాణ ఏర్పడిన తర్వాత సమస్యలన్నీ దశల వారీగా పరిష్కారమయ్యాయని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మిషన్ భగీరథ శుద్ధజలం అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఇన్వర్టర్లు, జనరేటర్లు అవసరం లేని విధంగా విద్యుత్ సరఫరా అందిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.
నాడు నారాయణపేట జిల్లా మొత్తం కలిపి మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల పరిధిలో కేవలం 10 కంటే ఎక్కువ ట్రాక్టర్లు, ట్యాంకర్లు కూడా ఉండే పరిస్థితి లేదన్నారు. కానీ నేడు ప్రతి జీపీకి ప్రభుత్వం ట్రాక్టర్, ట్యాంకర్, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి అద్భుతంగా మార్చిందని తెలిపారు. నారాయణపేట జిల్లా అవుతుందని ఎవరైనా ఊహించారా..? అలాంటిది జిల్లాగా మార్చి సకల సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు. మెడికల్ కళాశాల, దవాఖాన, నర్సింగ్ కళాశాల, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఏర్పాటు చేశామన్నారు. రెండు , మూడేండ్లలో నారాయణపేట జిల్లాకు సకల సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ‘మన ఊరు-మనబడి’ పథకంలో రాబోయే మూడేండ్లలో అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరుస్తామని వివరించారు. వచ్చే ఏడాది జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం సొంత భవనంలో జరుపుకొందామన్నారు.
‘పాలమూరు’తో సస్యశ్యామలం
పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి జయ మ్మ చెరువులు నింపి నారాయణపేట జిల్లాను సస్యశ్యామల చేస్తామని మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. జయమ్మ చెరువుతో అవసరమైతే తిరిగి జూరాల ప్రాజె క్టు నీటిని పంపించే ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా కేం ద్రంలో 600 పడకలు.. సుమారు 80 మంది వై ద్యులతో ఈ ప్రాంతంలో చక్కని వైద్య సదుపాయాలు అం దుబాటులోకి వస్తాయన్నారు. వచ్చేనెల 4న మహబూబ్నగర్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారని, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులంతా హాజరుకావాలన్నారు. జిల్లాకు రూ.2,015 కోట్ల రైతుబంధు సాయం అందించిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి కుటుంబానికి చెందిన 50 ఎకరాల పొలానికి ఏడాదికి రూ.5 లక్షల రైతుబం ధు సాయం అందజేస్తున్నామని తెలిపారు. సమావేశం లో అడిషనల్ కలెక్టర్ మాయాంక్ మిట్టల్, జెడ్పీ సీ ఈవో జ్యోతి, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.