మహబూబ్నగర్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సార్వత్రిక సమరం మొదలైంది. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం గురువారం నుంచి ప్రారంభమైంది. మహబూబ్నగర్ పార్లమెంట్కు జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి రవినాయక్, నాగర్కర్నూల్ పార్లమెంట్కు జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఉదయ్కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. తొలి రోజు రెండు సెగ్మెంట్ల పరిధిలో నలుగురు తమ నామినేషన్లను దాఖలు చే శారు. పాలమూరు నుంచి బీజేపీ అభ్యర్థి డీకే అరు ణ, స్వతంత్ర అభ్యర్థిగా మహమ్మద్ ఇంతియాజ్, నాగర్కర్నూల్ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మ ల్లురవి, బీజేపీ అభ్యర్థి భరత్ నామపత్రాలను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. నామినేషన్ల ఘ ట్టం ప్రారంభం కావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం మొదలైంది. కాగా మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 16,80,417, నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో 17,34,773 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికలను అధికార యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకొని.. ఎక్కడా ఎలాంటి అవాంఛనీ య ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయి లో.. స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేసింది.
తొలిరోజే ఆయా పార్టీల అభ్యర్థులు అట్టహాసంగా నామినేషన్లను దాఖలు చేశారు. పాలమూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా డీకే.అరుణ, స్వతంత్ర అభ్యర్థిగా మహమ్మద్ ఇంతియాజ్, కందనూలు నుంచి బీజేపీ అభ్యర్థిగా భరత్, కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లురవి నామపత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఆ యా కలెక్టరేట్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. మీడియాను సైతం రానివ్వలేదు. అభ్యర్థితోపాటు మరో నలుగురిని మాత్రమే అనుమతించారు. వాహనాలను వంద మీటర్ల దూరంలోనే నిలిపివేశారు.
మహబూబ్నగర్లో పార్లమెంట్ స్థానానికి డీకే అరుణ నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తున్న క్రమంలో ఏర్పాటు చేసిన ర్యాలీ అట్టర్ఫ్లాప్ అయిం ది. తొలిరోజే నామినేషన్ వేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ కార్యకర్తలు ఎవరూ పెద్దగా స్పందించి హాజరుకాలేదు. దీంతో ఆ పార్టీ నేతలు ఖంగుతిన్నారు. భగీరథ కాలనీలోని ఓ ఫంక్షన్హాల్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీకి వేల సం ఖ్యలో కార్యకర్తలు వస్తారని ఆశించినా వందల సం ఖ్యలో కూడా రాకపోవడంతో నిరాశే మిగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఒక్కరే హాజరయ్యారు. సెగ్మెంట్ పరిధిలోని ముఖ్య నేతలు ఎవరూ హాజరుకాలేదు.
మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానంపై అధికార కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. మరోవైపు సీఎం ఇలాఖాలో కాంగ్రెస్ను ఎలాగైనా ఓ డించేందుకు బీఆర్ఎస్, బీజేపీ గట్టి పోటీనిస్తున్నాయి. దీంతో పాలమూరు పోరు ప్రతిష్టాత్మకం గా మారింది. కాగా ఈ స్థానం నుంచి పోటీ చే స్తున్న హస్తం పార్టీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి, సీఎం రేవంత్ ఇద్దరూ కల్వకుర్తి నియోజకవర్గానికి సం బంధించిన వారే. దీంతో శుక్రవారం వంశీ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. ఉదయం 9:30 గంటలకు జిల్లా కేం ద్రంలోని మెట్టుగడ్డ నుంచి ర్యాలీ నిర్వహించి 11 గంటల వరకు క్లాక్టవర్కు చేరుకోనున్నది. అక్క డ కార్నర్ మీటింగ్లో ఎన్నికల ప్రచారాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి నేరుగా కలెక్టరేట్కు చేరుకొని రిటర్నింగ్ అధికారికి వంశీ నామినేషన్ అందజేయనున్నారు. పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలందరూ భారీ ఎత్తున జన సమీకరణ చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.