మద్దూర్(కొత్తపల్లి), ఏప్రిల్ 13 : బీఆర్ఎస్ అధినే త కేసీఆర్తోనే తన ప్రయాణమని, పార్టీని వీడే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి స్పష్టం చేశారు. తన సోదరుడు పట్నం మహేందర్రెడ్డి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరినా తాను మాత్రం కేసీఆర్ వెన్నంటే ఉంటానన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మ న్నె శ్రీనివాస్రెడ్డికి మద్దతుగా మద్దూరులో శనివారం కొత్తపల్లి, మద్దూర్ మండలాలకు చెందిన బీఆర్ఎస్ కా ర్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పట్నం మాట్లాడుతూ ఎంపీ మన్నెకు మద్దతు గా సోమవారం బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు హాజరవుతారని.. మద్దూర్, కొత్తపల్లి మండలాలకు చెందిన కార్యకర్తలందరూ హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 120 రోజుల్లోనే కాంగ్రెస్పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, ఆరు గ్యారెంటీలను అమలు చేసే దాక వదలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మళ్లీ బీఆర్ఎస్ సర్కారే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వీరారెడ్డి, మధుసూదన్రెడ్డి, శివకుమార్, విజయభాస్కర్రెడ్డి, గోపాల్, శ్రీనివాస్రెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.