నాగర్కర్నూల్, మే 27 : నియోజకవర్గంలో ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించిం ది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సోమవారం పరామర్శించారు. తిమ్మాజిపేట మండలం మారేపల్లి వద్ద ధ్వంసమైన కోళ్లఫారాన్ని పరిశీలించి పిడుగుపాటు తో వెంకటయ్య మృతి చెందగా ఆయన కుటుంబా న్ని, కూలిన రేకుల ఇల్లు బాధితులను పరామర్శించారు. అనంతరం తాడూరు మండలం ఇంద్రకల్ లో నిర్మాణంలో ఉన్న కోళ్ల షెడ్డు కూలి నలుగురు మృతిచెందిన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి నాగర్కర్నూల్ జిల్లా దవాఖానకు చేరుకొని మృతదేహాలను పరిశీలించి కుటుంబసభ్యులను ప రామర్శించారు. ఈ సందర్భంగా దవాఖాన ఎదుట విలేకరులతో మాట్లాడారు.
అకాల వర్షానికి మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.11లక్షలు, ఇండ్లు కూలిన వారికి రూ.5లక్షల చొప్పున పరిహారం అం దించాలని డిమాండ్ చేశారు. ప్రకృతి ప్రకోపానికి పే దలు నష్టపోవడంతోపాటు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. తెలకపల్లిలో పిడుగుపాటు కు బాలుడు మృతి చెందాడని వారి కుటుంబాలకు న్యాయం చేయాలని అధికారులతో మాట్లాడారు. గాలివానకు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదన్నారు. ప్రస్తుత సీఎం ఈ జిల్లాకు చెందిన వ్యక్తే కా బట్టి ప్రత్యేక దృష్టిపెట్టి న్యాయం చేయాలన్నారు.
ప్ర జాపాలన అని గొప్పలు చెప్పుకోవడం కాదని, వారి కి అన్యాయం జరిగినప్పుడు ముందుండాల్సిన బా ధ్యత సర్కారుదేనన్నారు. ఇంత జరిగినా ఆదుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవడం బా ధాకరమన్నారు. గాలివాన బీభత్సం వల్ల నియోజకవర్గంలో పదిమంది ప్రాణాలు కోల్పోయారని, వా రి కుటుంబాలను పరిశీలించేందుకు సైతం ఆదేశాలివ్వకపోవడం దురదృష్టకరమన్నారు.
మృతుల కు టుంబాలు, బంధువులతో దవాఖాన కిక్కిరిసింద ని.. వారి పరిస్థితులను అర్థం చేసుకోవాలని కోరా రు. సోమవారం సాయంత్రానికల్లా పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. ఇలాంటి ఘటనలకు స్పందించినప్పుడే ప్రజాపాలనకు విలువ ఉంటుందన్నారు. పరిహారం సైతం తూతూ మంత్రంగా కాకుండా కోళ్లఫారం షెడ్లు కూలిన బాధితులకు ఇంజినీర్లతో అం చనా వేయించి పరిహారం అందించాలన్నారు.
మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాం డ్ చేస్తూ సోమవారం జిల్లా దవాఖాన ఎదుట ప్ర జాసంఘాలు, విపక్షాలు, ప్రతిపక్ష నాయకులు ధ ర్నా, రాస్తారోకో నిర్వహించారు. ప్రతి కుటుంబాని కి ఎక్స్గ్రేషియా చెల్లించాలని, మృతిచెందిన వారి కుటుంబాల తరఫున ఆయా గ్రామాల ప్రజలు, బం ధువులు ధర్నాలో పాల్గొన్నారు. ప్రతి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం, బీఎస్పీ, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.