మక్తల్ : మతసామరస్యానికి ప్రతీకగా జరుపుకునే పండుగ రంజాన్ ( Ramadan ) అని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ( Rammohan Reddy ) అన్నారు. శనివారం రంజాన్ పండుగను సందర్భంగా మక్తల్ ఈద్గా ( Idga ) వద్ద ముస్లిం సోదరులు సామూహిక ప్రార్ధనలు నిర్వహించి ఉపవాస దీక్షలను విరమించారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం, మాజీ ఎమ్మెల్యే ఈద్గా వద్దకు చేరుకొని, మైనార్టీ సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఆయన మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీకకగా నిలిచే పండుగలో ఒకటైన రంజాన్ ఆనందదాయకంగా జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజుల ఆసిరెడ్డి, గుర్లపల్లి సర్పంచ్ గాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు చిన్న హనుమంతు, మైనార్టీ నాయకులు అన్వర్ హుస్సేన్, మన్నన్, సాదిక్, నాయకులు జుట్ల సాగర్, ఉపరి రఘు, మంగలి నరసింహతో తదితరులు పాల్గొన్నారు.