మూసాపేట (అడ్డాకుల), ఏప్రిల్ 17 : యూపీఎ స్సీ ఫలితాల్లో 3వ ర్యాంకు సాధించిన దోనూరు అనన్యరెడ్డిని బుధవారం హైదరాబాద్లో దేవరకద్ర మా జీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సన్మానించారు. అదేవిధంగా ఆమె తల్లిదండ్రులను కూడా అభినందించారు. ఈ సందర్భంగా ఆల మాట్లాడుతూ ప్రతిభ, పట్టుదల ఉంటే ఎదుగుదలను ఎవరూ ఆపలేరని అనన్యరెడ్డి నిరూపించారని కొనియాడారు.
తల్లిదండ్రులతోపాటు పొన్నకల్ గ్రామం, అడ్డాకుల మండలం, దేవరకద్ర నియోజకవర్గం, జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినందుకు ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ కల్పనావిజయ్కుమార్రెడ్డి, జెడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యుడు మహమూద్, జాజాల రాజేశ్వర్రెడ్డి, రంజిత్రెడ్డి, కావలి కృష్ణయ్య, నర్సింహారెడ్డి, ప్రభాకర్రెడ్డి ఉన్నారు.